మెగా స్టార్ చిరంజీవి కొరటాల మూవీ ప్రాజెక్ట్ కోసం కోకా పేటలో ఉన్న ‘సైరా’ సెట్స్ కు కొన్ని మార్పులు చేసి ఇప్పుడు ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఇది చాలదు అన్నట్లుగా ‘రంగస్థలం’ మూవీ కోసం బూత్ బంగ్లా పరిసరాలలో వేసిన సెట్స్ ను కూడ కొద్దిగా మార్చి చిరంజీవి కొరటాల మూవీకి ఉపయోసిస్తున్నట్లు తెలుస్తోంది.  

ఇప్పటికే ప్రారంభం అయిన ఈ మూవీ షూటింగ్ కార్యక్రమాలు సుమారు 60 రోజులపాటు ఈ ప్రాంతాలలోనే ఈమూవీ షూటింగ్ నిర్విరామంగా జరుపుతారని తెలుస్తోంది. వాస్తవానికి ఈ మూవీకి ‘గోవింద ఆచార్య’ అన్న టైటిల్ పెట్టాలని ఆలోచన ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ టైటిల్ కాకుండా అందరికీ కనెక్ట్ అయ్యే మరొక టైటిల్ కోసం అన్వేషణ జరుగుతున్నట్లు టాక్. 

నిన్నటి నుండి ఈ మూవీలో ఒక కీలక పాత్రకు మోహన్ బాబు ఎంపిక అయ్యాడు అని వార్తలు వస్తున్నా ఈ విషయమై అటు చిరంజీవి కాంపౌండ్ నుండి కానీ మోహన్ బాబు నుంచి కాని ఎటువంటి క్లారిటీ ఇప్పటి వరకు రాలేదు. గతంలో మోహన్ బాబు చిరంజీవి కలిసి అనేక సినిమాలలో కలిసి నటించినా వీరిద్దరి మధ్య కొన్ని బయటపడని విభేదాలు ఉన్నాయి. 

త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ సెట్స్ కు త్వరలోనే ఆమె కూడ వచ్చి జాయిన్ అవుతుందని తెలుస్తోంది. ‘సైరా’ నిర్మాణ సమయంలో చేసిన తప్పులు వల్ల చిరంజీవికి నష్టాలు వచ్చిన నేపధ్యంలో అలాంటి తప్పులు మళ్ళీ చేయకుండా మూవీ బడ్జెట్ విషయంలో పొడుపు చర్యలు పాటిస్తూ ఈ మూవీని అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేసి భారీ స్థాయిలో బిజినెస్ చేయాలని చిరంజీవి కొరటాల ఆలోచన. దేవాలయాల భూముల అన్యాక్రాంత మాఫియా నేపధ్యంలో జరిగే ఈ మూవీ కథలో రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ చాల భారీ సెటైర్లు ఉంటాయి అన్న ఊహాగానాలతో ప్రచారం జరుగుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: