విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ కూతురు శృతిహాస‌న్‌. ఈమె తండ్రి పేరు చెప్పుకుని ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన‌ప్ప‌టికీ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకుంది. అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించింది ఈ భామ‌. కేవలం హీరోయిన్‌గానే కాకుండా గాయ‌నిగా కూడా శృతిహాస‌న్ సంద‌డి చేస్తుంటుంది. అలాగే స్పెష‌ల్ సాంగ్స్‌లో కనిపించి క‌నువిందు చేస్తుంటుంది. క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి త‌న‌యుడు నిఖిల్ కుమార్ హీరోగా మ‌హ‌దేవ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం జాగ్వార్.

 

ఈ చిత్రం అన్ని భాష‌ల్లో అప్ప‌ట్లో ఇందులో ఒక సాంగ్‌లో న‌టించాల‌ని ఆమెను కోరార‌ట‌. ఇక ఈ భామ ఆగ‌డు చిత్రంలో మ‌హేష్‌తో క‌లిసి  ఒకే ఒక్క సాంగ్‌ చేసిన హీరోయిన్‌ కంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది. `జంక్ష‌న్‌లో` అంటూ చేసే పాట‌తో ఓ ఊపు ఊపేసింది. ఆగ‌డు చిత్రం ఆశించినంత‌గా హిట్ కాలేదు. కానీ శృతి న‌టించిన పాట కోసం చాలా మంది వెళ్ళారు. ఇక ప‌రువాల‌ను ప‌ర‌చ‌డంలో ఆమె త‌ర్వాతే ఎవ‌రైనా అని చెప్ప‌వ‌చ్చు. ఇక ఈ పాటలో న‌టించిన త‌ర్వాతే మ‌హేష్ త‌న చిత్రంలో హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశ‌మిచ్చిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. టాలీవుడ్‌లో చాలా మంది హీరోల కూతుర్లు హీరోయిన్‌గా రావ‌డం కాస్త క‌ష్టం.

 

అయితే క‌మ‌ల్ కూతురు టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వ‌డ‌మే కాకుండా ఎక్క‌డా ఆలోచించ‌కుండా అందాల‌ను ఆర‌బోసింది. ఈ సాంగ్‌లో డోస్ మ‌రికాస్త ఎక్కువ‌గానే అనిపించింది. బ్లాక్ క‌ల‌ర్ డ్ర‌స్‌లో అమ్మ‌డి అందాలు చూస్తుంటే ఎవ‌రి మ‌నసైనా చెలించ‌కుండా ఉంటుందా అన్న‌ట్లు ఉంది. ప్రేమమ్ చిత్రం త‌ర్వాత ఈ భామ తెలుగులో పెద్ద‌గా క‌నిపించ‌లేదు. కెరియ‌ర్ మంచి పీక్స్‌లో ఉన్న స‌మ‌యంలో బాలీవుడ్‌లో సింగ‌ర్‌తో ప్రేమ‌లో ప‌డి సినిమాల‌ను ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు మ‌ళ్ళీ అత‌నితో బ్రేక‌ప్ అయి తిరిగి మ‌ళ్ళీ సినిమా ఛాన్స‌ల కోసం ఎదురు చూస్తుంది. శృతి ఏకంగా హాలీవుడ్ చాన్స్‌లే అందుకుంటోంది. యుఎస్‌ఏ నెట్‌వర్క్స్ నిర్మించనున్న ట్రెండ్ స్టోన్ సిరీస్‌లో కీలకపాత్రకు నిర్మాతలు శృతిని సంప్రదించారట. ఆమె కూడా ఓకే అనడంతో -వెయిట్రెస్ ముసుగులో హత్యలకు పాల్పడే కిల్లర్‌గా శృతి కనిపించే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: