తెలుగు చిత్ర పరిశ్రమలో సమంత అందరికి ఇన్స్పిరేషన్ గా ఉంటూ ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే వివాహం తర్వాత హీరోయిన్లకు క్రేజ్ తగ్గిపోతుంది అని ఉన్న ఒక ఆలోచనలను దూరం చేస్తూ పెళ్లి తర్వాత మరింత జోరు తో దూసుకు పోతుంది ఈ అమ్మడు. ఇక ఈ అమ్మడు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై 10 ఏళ్లు గడిచిపోతున్నాయి. అయినప్పటికీ అమ్మడి క్రేజ్  మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. యువ హీరోయిన్లకు మించిన క్రేజ్ ను  సొంతం చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రష్మిక మందన్న పూజా హెగ్డే లాంటి యువ హీరోయిన్స్ హవా  నడిపిస్తున్న సమయంలో కూడా సమంత వీళ్లకు మించి సత్తా చాటుతూనే ఉంది. నటిగా ఎన్నో ప్రశంసలు కూడా అందుకున్నారు. అయితే పెళ్లి తర్వాత ఈ అమ్మడు వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఇక తాజాగా సమంత మరో ఘనతను సొంతం చేసుకుంది. 

 

 

 హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019 గా తొలిస్థానంలో నిలిచింది అక్కినేని వారి కోడలు సమంత. వివిధ రంగాల్లో రాణిస్తున్న 40 ఏళ్లలోపు వయసు గల మహిళలు పరిగణలోకి తీసుకొని ఈ సర్వే నిర్వహించగా ఈ సర్వేలో ఎక్కువ ఓట్లు దక్కించుకుని అక్కినేని వారి కోడలు నాగచైతన్య సతీమణి సమంత అగ్రస్థానంలో నిలిచింది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం టాప్ హీరోయిన్లుగా కొనసాగుతూ కెరీర్ పరంగా దూసుకుపోతున్న.. పూజా హెగ్డే ఐదో స్థానంలో నిలువగా రష్మిక మందన్న 9వ స్థానం దక్కించుకుంది.

 

 

 ఇక ఈ లిస్టులో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి... భారత ఖ్యాతిని మరింతగా పెంచిన గొప్ప మహిళ పీవీ సింధు మూడవ స్థానంలో నిలిచింది. అంతేకాదండోయ్ ఈ జాబితాలో రకుల్ కాజల్ వరుసగా ఏడు ఎనిమిది స్థానాల్లో నిలవడం గమనార్హం. ఇక ఆ యాంకర్ శ్రీముఖి ఈ జాబితాలో 25 వ స్థానంలో నిలిచింది. ఇక సమంత ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవడం పై సమంత అభిమానులు అక్కినేని ఫాన్స్  ఫుల్ కుష్  అవుతున్నారు. తమ అభిమాన హీరోయిన్ కు ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం సంతోషకరం అంటున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: