ఆ మద్య సూర్య దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన ‘ఖుషి’ మూవీలో కనిపించింది అందాల భామ భూమికా చావ్ల.  ఈ మూవీలో భూమికకు మంచి పేరు వచ్చింది.  తర్వాత శివాజీ నటించిన ‘మిస్సమ్మ’ కూడా మంచి హిట్ అయ్యింది.  తెలుగు, తమిళంలో మంచి ఫామ్ లో ఉన్న భూమి తర్వాత పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది.  ఆ మద్య బాలీవుడ్ లో ‘ధోని’ మూవీలో నటించింది.  సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ బ్యాటీ నాని హీరోగా నటించిన ‘ఎంసీఏ’ చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఇటీవల బాలయ్య నటించిన ‘రూలర్’ చిత్రంలో నటించింది. 

 

ఆ మద్య భూమిక తన భర్తతో విడాకులు తీసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.  దీనిపై ఈ అమ్మడు తన పర్సనల్ అని చెప్పింది.  తాజాగా అలా ఆమె చేసిన 'సవ్యసాచి', 'ఎంసీఏ','రూలర్'  మరో మూవీలో నటిస్తుంది భూమిక.  అయితే ఈ మూవీలో రొటీన్ కి భిన్నంగా నెగిటీవ్ పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  తెలుగులో తను ఒక స్టార్ హీరో చిత్రంలో ఒక కీలకమైన పాత్రను చేస్తున్నట్టుగా చెప్పింది. నెగెటివ్ షేడ్స్ తో కూడిన లేడీ విలన్ గా తను కనిపిస్తానని అంది.

 

ఈ తరహా పాత్రను చేయాలనే తను చాలాకాలం నుంచి అనుకుంటున్నాననీ, అలాంటి పాత్ర పడటం తన అదృష్టమని చెప్పుకొచ్చింది.  ఒకప్పటి టాప్ హీరోయిన్లు ఇప్పుడు తల్లి, అత్త పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో భూమిక ఇలా నెగిటీవ్ పాత్రలో నటించడం పై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. అయితే భూమిక పొగరుబోతు, పౌరుషం ఉన్న పాత్రల్లో గతంలో నటించిన విషయం తెలిసిందే. మరీ ఈ అమ్మడు విలన్ అవతారం ఎత్తితే ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: