మెగాస్టార్ చిరంజీవి నటన అంటే నచ్చని వారు ఎవరు ఉండరు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఆచార్య సినిమా గురించి చాలా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పాలి. తాజాగా ఈ సినిమా నుంచి త్రిష కూడా తప్పుకోవడం జరిగింది. ఇక ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం దర్శకుడు ఎవరిని తీసుకుంటాడో అన్న విషయం ఎవరికీ అర్థం అవ్వటం లేదు. ఆ కీలక పాత్ర కోసం ఎక్కువగా రామ్ చరణ్, మహేష్ పేర్లు వినిపిస్తున్నాయి చెప్పాలి. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా విడుదల అవ్వడానికి చాలా సార్లు వాయిదా పడింది అనే చెప్పాలి. 

IHG


ఇక ఆచార్య సినిమా కోసం కీలక పాత్రలో మహేష్ బాబుని ఎంపిక చేస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం మహేష్ బాబు కాదు ఆ పాత్రకి మోహన్ బాబుని ఎంపిక చేసారని టాలీవుడ్ ప్రముఖులు. ఈ విషయంపై మోహన్ బాబుపై చర్చలు కూడా జరిగాయి అట. ఈ పాత్రకోసం మోహన్ బాబుని అడగగా అందుకు ఆయన ఓకే చెప్పాలని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆ పాత్రకు ప్రాధాన్యత ఉండడం వల్లనే మోహన్ బాబు ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. 


అంతేకాకుండా ఈ విషయంపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేస్తారని సమాచారం. ఇక ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి అనంతరం విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సినిమా యూనిట్ తెలియచేస్తుంది. ఏదిఏమైనా మెగాస్టార్ చిరు సినిమా అంటే ఎవరికీ ఉత్సాహం ఉండదు చెప్పండి. అందుకే ఆచార్య సినిమా సంబంధించిన ఏ చిన్న విషయమైనా పెద్ద దుమారమే లేపుతుంది. ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకి అన్ని సినిమా రంగాల్లో అన్ని సినిమాలను నిలిపివేసి అందరూ ఇంటికే పరిమితమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: