టాలీవుడ్ లో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యరికం చేసిన పూరి జగన్నాథ్.. మొదటి సారిగా మెగా హీరో పవన్ కళ్యాన్ తో ‘బద్రి’ చిత్రం తీశారు.  ఫస్ట్ మూవీ.. అందులోనూ మెగా హీరో.. ఈ మూవీ టాక్ ఎలా ఉంటుందో తన భవిష్యత్ ఎలా ఉంటుందో అని రిలీజ్ రోజు తెగ టెన్షన్ అయ్యాడని అంటున్నారు పూరి స్నేహితుడైన రఘు కుంచె.  'బద్రి' ప్రేక్షకుల ముందుకు వచ్చి నిన్నటితో 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినీ సెలబ్రెటీలు తమ అనుభవాల గురించి షేర్ చేసుకుంటున్నారు.  ఈ సందర్భంగా నటుడు, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె ‘బద్రి’ మూవీ గురించి ముచ్చటించారు.  పూరి కెరీర్ బిగినింగ్ లో రఘు కుంచె తో మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి.  

 

 

'బద్రి' రిలీజ్ రోజున ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ కి మార్నింగ్ షోకి వెళ్లాము. అక్కడ పవన్ అభిమానుల హడావిడి చూసి హ్యాపీగా ఫీలయ్యాం. అయితే మూవీ పూర్తయ్యా.. కొంత మంది చేసిన టాక్ కి పూరి తెగ టెన్షన్ అయ్యాడు.. పూర్తిగా డీలా పడిపోయాడు. సినిమా పోయిందని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారనీ, నిర్మాత త్రివిక్రమరావు ఫోన్ కూడా తీయడం లేదని పూరి చాలా బాధపడ్డాడు. ఇక సినిమా రివ్యూలు కూడా అనుకూలంగా రాకపోవడం ఆందోళన పడ్డాడు పూరి.

 

 

కానీ, మరుసటి రోజు అంతా విచిత్రం.. థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కట్టారు.. హిట్ టాక్ అని రావడంతో మనోడి ముఖంలోఆనందం అంతా ఇంతా కాదు అన్నారు.  చిరంజీవి .. పవన్ నుంచి పూరికి అభినందనలు వచ్చాయి. నిర్మాత త్రివిక్రమరావు నేరుగా వచ్చి పూరిని హత్తుకున్నాడు. అప్పుడు పూరి చిన్నపిల్లాడిలా గెంతులు వేయడం ఇప్పటికీ నాకు గుర్తు వుంది అంటూ చెప్పుకొచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: