టాలీవుడ్ బాహుబలి రెబల్ స్టార్ ప్రభాస్, ప్రస్తుతం జిల్ మూవీ దర్శకుడు రాధాకృష్ణ దర్సకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న ఆ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, యువి క్రియేషన్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు ఆ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. యూరోప్ లో కొన్నేళ్ల క్రితం జరిగిన ప్రేమకథగా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆకట్టుకునేలా దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు టాక్. 

 

ఇకపోతే ఈ సినిమా తరువాత మహానటి దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయనున్నారు. అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ ఖర్చుతో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో ప్రారంభం కానుంది. ఇకపోతే ఎప్పటినుండో ప్రభాస్ అభిమానులు కోరుకుంటోంది ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తే చూడాలని. అయితే ఆ కాంబినేషన్ ఎప్పుడు వర్కౌట్ అవుతుందో చెప్పలేనప్పటికీ, త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ యాక్షన్, పంచ్ డైలాగ్స్, స్టైలిష్ ఫైట్ సీన్స్, అదిరిపోయే కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ వంటివి జోడించి ప్రభాస్ తో ఆయన ఒక సినిమా చేస్తే చూడాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

 

వాస్తవానికి గతంలో కొన్నేళ్ల క్రితం వీరిద్దరి కాంబోలో ఒక సినిమా రావాల్సి ఉందని, అయితే కొన్ని అనివార్య కారణాల వలన వర్కౌట్ కాలేదని సమాచారం. ఇక మరోవైపు అటు ప్రభాస్, ఇటు త్రివిక్రమ్ ఇద్దరూ కూడా తమ తమ ప్రాజక్ట్స్ తో ముందుకు సాగుతుండడంతో ఈ కాంబో వర్కౌట్ కాలేదని తెలుస్తోంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో త్రివిక్రమ్ మాట్లాడుతూ, తాను కూడా ప్రభాస్ గారితో చేయబోయే సినిమా కోసం ఎదురు చూస్తున్నానని, అయితే తామిద్దరి కాంబో కుదరాలంటే టైం రావాలని చెప్పడం జరిగింది. మరి ఆ టైం ఎప్పుడు వస్తుందో వీరిద్దరూ ఎప్పుడు కలిసి సినిమా చేస్తారో తెలియదుగాని, ఒకవేళ చేస్తే మాత్రం ఆ సినిమా రికార్డుల దుమ్ము దులపడం ఖాయం అనే చెప్పాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: