బాలీవుడ్ బ్యూటీక్వీన్ కంగనా రనౌత్ కి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు అందంతో ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో తన అభినయంతో అంతకంటే ఎక్కువగానే ప్రేక్షకులను అలరిస్తుంది . నటిగా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న కంగనా రనౌత్ దర్శకురాలిగా కూడా తన ప్రతిభను చాటింది. ఇక హీరోలకు సైతం పోటీ ఇచ్చే విధంగా కంగనారనౌత్ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించింది కంగనారనౌత్. ఇక వివాదాలతో అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. 

 

 

 అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కంగనారనౌత్ టాలీవుడ్ లో ఓ అవకాశాన్ని వదులుకోక పోతే   తాను టాప్   హీరోయిన్ అయ్యేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.. మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన పోకిరి సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులు సృష్టించి భారీ వసూళ్లను రాబట్టి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా  విషయం తెలిసిందే. పోకిరి సినిమా కి సంబంధించిన ఆఫర్ మొదట తనకే వచ్చింది అని తెలిపింది కంగనా. తను గ్యాంగ్ స్టార్  ఆడిషన్స్ కి వెళ్ళిన సమయంలోనే పోకిరి ఆడిషన్స్ కూడా జరుగుతున్నాయి అంటూ తెలిపిన కంగనా రనౌత్... ఆ రెండు ఆడిషన్స్  కి హాజరు కాగా రెండు ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చారు. 

 

 

 అంతలోనే గ్యాంగ్ స్టార్ సినిమాకి ముందుగా డేట్లు ఇచ్చేయడం కారణంగా పోకిరి సినిమా కి డేట్స్ అడ్జెస్ట్ చేయలేక పోయాను అంటూ తెలిపిన కంగనా రనౌత్... ఒకవేళ తాను అప్పుడు పోకిరి సినిమా ను వదులుకోకుంటే ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగే దాన్ని అంటూ చెప్పుకొచ్చింది. ఇక పోకిరి సినిమా మిస్ అయి నప్పటికీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఏక్ నిరంజన్ సినిమాలో ఛాన్స్ వచ్చింది ఈ అమ్మడుకి . కానీ ఆ  సినిమా మాత్రం అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది ఈ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: