కెజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ ఆ సినిమాతో సౌత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కెజిఎఫ్ 2 సినిమాతో మరోసారి తన ప్రతిభ చాటాలని చూస్తున్న ప్రశాంత్ నీల్సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ తో సినిమా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తారని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ చేసే సినిమా ఇదే అంటున్నారు. అయితే ఓ పక్క త్రివిక్రం శ్రీనివాస్ కూడా తారక్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

 

అయితే ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ లో నాచురల్ స్టార్ నాని ఇన్వాల్వ్ మెంట్ కూడా ఉంటుందని తెలుస్తుంది. అదేంటి ఒకవెళ ఈ సినిమాలో నాని కూడా నటిస్తాడా అంటే.. నాని నటించడం కాదు ఈ సినిమా ప్రొడక్షన్ లో నాని భాగస్వామ్యం అవుతున్నాడని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ తో పాటుగా నాని వాల్ పొస్టర్ సినిమా కూడా తారక్ సినిమా ప్రొడక్షన్ లో భాగం కానుందట. మరి ఎన్.టి.ఆర్ సినిమా నిర్మించే ప్లాన్ నానికి ఎలా వచ్చిందో ఏమో కాని సినిమా కథ నచ్చి ఈ ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు.

 

స్టార్ హీరో సినిమా అంటే భారీ బడ్జెట్ ఉండాల్సిందే. అయితే దానికి తగినట్టుగా బిజినెస్ కూడా జరుగుతుంది. నాని కూడా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్.టి.ఆర్ సినిమా కోసం నాని చేస్తున్న ఈ క్రేజీ అటెంప్ట్ ఎలాంటి ఫలితాన్ని తెస్తుందో చూడాలి. ప్రస్తుతం నాని నటించిన వి సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా.. శివ నిర్వాణ డైరక్షన్ లో టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో శ్యాన్ సింగ రాయ్ మూవీ చేయాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: