ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సూపర్ స్టార్ మహేష్ బాబు... తనకు నచ్చిన ఏ విషయం గురించి అయినా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటారు.చిన్న హీరో పెద్ద హీరో చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఎలాంటి ఈగో లేకుండా అందరి గురించి మంచిగా మాట్లాడే వ్యక్తిత్వం ఆయనది. ఇక వివరాల్లోకి వెళితే....2012 వ సంవత్సరం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ రేప్ కేసు ఆధారంగా తెరకెక్కిన ‘ఢిల్లీ క్రైమ్’ వెబ్‌ సిరీస్ అరుదైన ఘనత సాధించింది. ఈ వెబ్‌ సిరీస్‌ ఉత్తమ డ్రామా కేటగిరీలో ప్రతిష్ఠాత్మకమైన ‘ఎమ్మీ’ అవార్డు గెలుచుకుంది. ఎమ్మీ’ అవార్డు సొంతం చేసుకున్న ‘ఢిల్లీ క్రైమ్’ యూనిట్‌కు ప్రముఖులు, నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లవెత్తుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖులతో పాటు మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా యూనిట్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘ఢిల్లీ క్రైమ్’ ఒక మాస్టర్ స్ట్రోక్. అద్భుతమైన విజయం సాధించినందుకు యూనిట్ సభ్యులందరికీ అభినందనలు. మీకు ఆ అర్హత’ ఉంది అంటూ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ట్వీట్ చేశారు.ప్రస్తుతం మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది...




అర్జెంటీనా, జర్మనీ, యూకేలకు చెందిన వెబ్‌ సిరీస్‌లతో పోటీపడి మరీ ఈ అవార్డు దక్కించుకోవడం విశేషం. ఇందులో షెఫాలి షా, రాజేష్ తైలాంగ్, ఆదిల్ హుస్సేన్, రసిక దుగ్గల్, గోపాల్ దత్ తివారీ, జయ భట్టాచార్య, అభిలాషా సింగ్, వినోద్ శరవత్, మృదుల్ శర్మ, అనురాగ్ అరోరా, సిద్ధార్థ్ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రిషి మెహతా దర్శకుడు.



ఈ వెబ్ సిరీస్ ‘ఎమ్మీ’ అవార్డు సొంతం చేసుకోవడం పట్ల రిషి మెహతా ఆనందం  చేశారు. ఈ సందర్భంగా నిర్భయకు నివాళులర్పించారు. పురుషుల చేతిలో హింసకు గురయ్యే మహిళలకు ఈ వెబ్ సిరీస్‌ను అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో కీలక పాత్రలో నటించిన షెఫాలి షా సంతోషాన్ని పట్టలేకపోతున్నానంటూ ట్వీట్ చేసింది. నిర్భయ కేసులో నిందితులను గుర్తించే పోలీస్‌ డిప్యూటీ కమిషనర్‌గా షెఫాలి షా అద్భుతంగా నటించి చక్కటి ప్రదర్శన ఇచ్చింది. ఇక ఇలాంటి ఎన్నో మూవీ విశేషాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...


మరింత సమాచారం తెలుసుకోండి: