చిరుత సినిమా ద్వారా టాలీవుడ్ కి తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా అరంగేట్రం చేసిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, తొలి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన  ఈ సినిమాలో చరణ్ నటన ప్రేక్షకాభిమానులను అలరించింది. ఇక దాని అనంతరం ఏకంగా దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమా చేసిన చరణ్, ఆ సినిమా ద్వారా అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి రెండవ సినిమాతోనే హీరోగా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు గడించారు.


అనంతరం వరుసగా ఛాన్స్ లతో కొనసాగిన చరణ్ మధ్యలో ఎన్నో గొప్ప విజయాలు సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల రంగస్థలం సినిమాతో అతి పెద్ద సక్సెస్ అందుకున్న చరణ్, ప్రస్తుతం తన స్నేహితుడు ఎన్టీఆర్ తో కలిసి తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకోనున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక హీరోగా నటిస్తున్నారు. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకు షూటింగ్ ని జరుపుకుంది. రామ్ చరణ్ ఇందులో అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.


అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ తరువాత ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే దీని అనంతరం చరణ్ ఎవరితో సినిమా చేస్తారు, ఎటువంటి సినిమా చేస్తారు అనే దానిపై కొద్దిరోజులుగా ఆయన అభిమానుల్లో అలానే ప్రేక్షకుల్లో కొంత చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయమై చరణ్ పెద్ద ప్లాన్ సిద్ధం చేసారని అంటున్నాయి కొన్ని టాలీవుడ్ వర్గాలు. ఇక మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరోగా తనకు ఇమేజ్ వస్తుందని భావిస్తున్న చరణ్, ఇటీవల ఒక బడా డైరెక్టర్ చెప్పిన కథకి పచ్చ జండా ఊపారని, ఒక అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా తెలుగు సహా పలు భారతీయ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనుందని, అలానే అతి త్వరలో దీనికి సంబంధించి అధికారిక న్యూస్ కూడా బయటకు రానుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం ఇది నిజంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ కి మంచి పండుగ న్యూస్ అని చెప్పకతప్పదు...!!


మరింత సమాచారం తెలుసుకోండి: