
ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ 90 శాతం పూర్తయిందట. ఈ లేటెస్ట్ షెడ్యూల్ గనుక పూర్తయితే సినిమా మొత్తం పూర్తయినట్లే. ఈ నేపథ్యంలోనే చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఫైట్ మాస్టర్స్ అన్బుమణి .. అరివు మణి తో కలిసి సెట్ లో వున్న ఫొటోలను ప్రశాంత్ నీల్ షేర్ చేశారు. ఈ ఫొటోలు సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అలాగే క్లైమాక్స్ కు సంబంధించిన ఓ కీలక ఘట్టాలకు సంబంధించి కూడా ఇక్కడే షూటింగ్ మొదలుపెట్టారు. ఇందులో యష్, సంజయ్ దత్ పాల్గొంటున్నారు. వీళ్లతో పాటు వందల మంది జూనియర్ ఆర్టిస్ట్ లు, ఫైటర్ లు కూడా పాలు పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా బయటికి వచ్చిన యష్ ఫొటో ఫ్యాన్స్ను విపరీతంగా అలరిస్తోంది.
`కీలక ఘట్టాలన్నీ పూర్తయ్యాయి. ఇది ‘కెజిఎఫ్ చాప్టర్ 2’ చివరి షెడ్యూల్. కానీ ఈ మూవీకి సంబంధించిన విలన్ ఎప్పటికీ అలాగే వుంటాడు` అని ట్వీట్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇందు కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారట. ఈ మూవీ టీజర్ ని జనవరి 8న హీరో యష్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారట.