
ఇక ఇప్పుడు కీర్తి సురేశ్, నితిన్ జంటగా నటిస్తున్న రంగ్ దే నుంచి కూడా ఇప్పుడు ఒక అఫీషియల్ న్యూస్ వచ్చింది. సంక్రాంతి బరిలో సినిమా ఉండబోతోందంటూ వినిపిస్తున్న వార్తలపై రంగ్దే టీం క్లారిటీ ఇచ్చింది. సినిమాను మార్చి 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. నితిన్, కీర్తి సురేష్ తొలి కాంబినేషన్లో సూర్యదేవర నాగవంశీ ఆధ్వర్యంలోని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పిస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగుతున్నాయి. 'ప్రేమ'తో కూడిన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పీసీ .శ్రీరామ్ ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ అందిస్తున్న సంగీతం హైలెట్గా నిలవనుంది. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేశ్ చాలా అందంగా కనిపిస్తోందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. కీర్తి అందాన్ని చూసేందుకే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నామంటూ కూడా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.