టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో ఉన్న హీరోలు మరో హీరో పేరు చెప్పడానికి కూడా పెద్దగా ఇష్టపడరు. అంతగా మరో హీరో పేరు వాడాల్సి వస్తే.. తమ ఫ్యామిలీలోని సీనియర్ హీరోల గురించే ప్రస్తావిస్తుంటారు. మరో హీరోను తమ సినిమాల్లో హైలెట్ చేస్తే.. ఫ్యాన్స్ హర్ట్ అవుతుంటారన్నది వారి ఫీలింగ్. అయితే ఇదంతా ఒకప్పటి పరిస్థితి. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆడియెన్స్ కూడా మారిపోయారు.ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని తన తర్వాత సినిమా చేయబోతున్నారు.ఇందులో భాగంగానే చైతన్య ప్రస్తుతం తను కొత్తగా నటిస్తున్న థాంక్య చిత్ర నిర్మాణంలో పాల్గొన్నారు.ఇందుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది

.ఈ సినిమాలో చైతన్య అభిరాం అనే పాత్రలో నటించనున్నారు.అభిరామ్ ఈ సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబుకు పెద్ద అభిమానిగా ఉండటం వల్ల ఈ సినిమాలో మహేష్ బాబు అభిమానుల సంఘం అధ్యక్షుడిగా కనిపించనున్నాడు.నాగచైతన్య పేరు అభిరామ్ పేరిట, మహేష్ బాబు పోస్టర్లతో ఉన్న బ్యానర్లను థియేటర్ ప్రాంగణంలో కట్టారు.దీంతో ఈ సినిమాలో నాగచైతన్య మహేశ్ బాబు అభిమానిగా కనిపించబోతున్నాడనే న్యూస్ లీకైంది. మరోవైపు ఈ సినిమాలో కొన్ని నిమిషాలపాటు మహేశ్ బాబు తళుక్కున మెరవబోతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇక అక్కినేని ఫ్యామిలీతో మహేశ్ బాబుకు మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి.


 బీవీఎస్‌ రవి సమకూర్చిన కథను దర్శకుడు విక్రమ్‌ కే కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తుండగా.. అవికా గోర్‌ మరో కథానాయికగా కనిపించనుంది. చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఈ విషయం అటు అక్కినేని అభిమానులు, ఇటు మహేష్ బాబు అభిమానులకు ఇది ఒక శుభవార్త అనే చెప్పొచ్చు  

మరింత సమాచారం తెలుసుకోండి: