ప్రస్తుతం యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా కెజిఎఫ్ చాప్టర్ 2. రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కెజిఎఫ్ చాప్టర్ 1 పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయి దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా ఎంతటి గొప్ప సెన్సేషన్ ని క్రియేట్ చేసింది అనేది మనందరికీ తెలిసిందే. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకి రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు. అయితే దానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చాప్టర్ 2 పై దేశవిదేశాల్లోని ప్రేక్షకుల్లో ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి.

ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ కి భారీ స్థాయి రెస్పాన్స్ వచ్చింది. హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై మొదటి భాగాన్ని మించేలా మరింత గ్రాండియర్ గా ముఖ్యంగా భారీ హంగులు, ఖర్చు తో పాటు అడియాన్స్ ని ఎంతో అలరించేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ దీని స్టోరీ ని రాసుకున్నట్లు సమాచారం. ఇటీవల ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో రావు రమేష్, ప్రకాష్ రాజ్, సంజయ్ దత్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా మే నెలాఖరులో రిలీజ్ అవుతుందని అంటున్నారు.

అసలు మ్యాటర్ ఏమిటంటే, ఈ సినిమా యొక్క బిజినెస్ ప్రస్తుతం భారీ స్థాయిలో జరుగుతుందని, దాదాపుగా అన్ని భాషల్లో కూడా ఈ మూవీకి ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయి అంటున్నారు. అయితే తెలుగులో కెజిఎఫ్ చాప్టర్ 1 ని రూ.5.5 కోట్లకు కొనుగోలు చేయగా అది టోటల్ గా రూ.12 కోట్లు రాబట్టిందని, ఇక ప్రస్తుతం చాప్టర్ 2 రైట్స్ ఏకంగా రూ.60 కోట్లకు పైగా పలుకుతున్నట్లు చెప్తున్నారు. మరోవైపు అంత భారీ ధరని సైతం ఇచ్చి తీసుకునేందుకు పలువురు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు సైతం ముందుకు వస్తున్నారట. ఒకరకముగా చాప్టర్ 1 కి ఐదు రెట్లు పైచిలుకు ధర పలుకుతున్న చాప్టర్ 2, రిలీజ్ అనంతరం మంచి సక్సెస్ సాధిస్తే ఎంతో భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఇక ప్రస్తుతం ఈ సినిమా తెలుగు రైట్స్ విషయం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: