పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన 'అజ్ఞాతవాసి' సినిమా ప్లాప్ అయిన తరువాత రాజకీయాల్లో బిజీ అయ్యి దాదాపు మూడు సంవత్సరాల తరువాత  'వకీల్ సాబ్' సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వేణుశ్రీరామ్ రూపొందించిన ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్, నివేద తామస్, అంజలి, అనన్య లు ముఖ్య పాత్రలు పోషించారు. యస్ యస్ తమన్ సంగీతం అందించాడు.ఈ సినిమా విషయంలో అటు పవన్ కళ్యాణ్, ఇటు దిల్ రాజు ఇద్దరూ చాలా హ్యాపీ అయ్యారు. ఇక పవర్ స్టార్ తో సినిమా చేసి తన కలని నేరవేర్చుకున్నాడు దిల్ రాజు.ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.


ఇప్పటికే పవన్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. 'వకీల్ సాబ్' రిజల్ట్ తో పవన్ కూడా దిల్ రాజుతో మరో సినిమా చేయడానికి అంగీకరించాడట. దీనికోసం పవన్ కి భారీ అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్ లో పెట్టడంతో దిల్ రాజు సినిమా ఎప్పుడు మొదలవుతుందనేది చెప్పలేని పరిస్థితి.కాని ఖచ్చితంగా సినిమా చేస్తాడట.అందుకే పవన్ కి సరిపడా కథను, దర్శకుడికి వెతికే పనిలో పడ్డాడట. అన్నీ కుదిరితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికార ప్రకటన రానుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్ తో పాటు.. క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి లాంటి దర్శకులతో సినిమాలు మొదలుపెట్టనున్నాడు. ఈ సినిమాలు అయ్యాక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందట..మొత్తానికి దిల్ రాజు రెండవ సారి కూడా పవర్ స్టార్ తో సినిమా చేస్తూ తన కలని నేరవేర్చుకోబోతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: