చాలామంది సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతారు. కొందరు తమ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలను కూడా బయట పెట్టడానికి ఇష్టపడరు. అటువంటి వారిలో కొందరు తమ బంధుత్వం బయటపడే లోపు విడిపోతుంటారు. ఆ కోవలోకే ఛత్రపతి ఫేమ్ చంద్రశేఖర్ వస్తారు. ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నారనే విషయం తెలిసే లోపే విడాకులు తీసుకోవడం కూడా జరిగిపోయింది.


నిజానికి చంద్రశేఖర్ భార్య ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆమె గత 8 సంవత్సరాలుగా ఎన్నో సీరియల్స్ లో, సినిమాల్లో నటించి బుల్లితెర, వెండితెర ప్రేక్షకులను అలరించారు. కానీ చంద్రశేఖర్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాతనే ఆమె సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అందువల్ల చంద్రశేఖర్ కి, ఆమెకు పెళ్లి అయ్యిందన్న విషయం ఎక్కువమందికి తెలియదు.



ఖమ్మం జిల్లాకు చెందిన భవానీ చంద్రశేఖర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికి చంద్రశేఖర్‌ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టలేదు. దీంతో భవానీ తల్లిదండ్రులు వీరి పెళ్లికి అంగీకరించలేదు. కానీ వీరిద్దరు హైదరాబాద్‌ పారిపోయి వివాహం చేస్తున్నారు. పెళ్లి అయిన శుభవేళ ఆయనకు ‘శాంతి నివాసం’ సీరియల్‌లో చిన్న ఆఫర్ దక్కింది. అనంతరం ఆయన జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్.1 సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఇక ఆ తర్వాత ఆయన తన కెరీర్ లో వెనుదిరిగి చూసుకోలేదు.



ఐతే భర్త అడుగుజాడల్లోనే భవానీ కూడా సినీ రంగ ప్రవేశం చేసి తన అందచందాలతో, అభినయంతో అనతికాలంలోనే పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదిగారు. ఆమె నటనా రంగంలోకి అడుగు పెట్టిన తర్వాత తన పేరుని నీలియా భవానీగా మార్చుకున్నారు.



వీళ్లిద్దరికీ మహేశ్వరన్, పూజిత అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐతే వీరి దాంపత్య జీవితం కొన్ని సంవత్సరాల పాటు సాఫీగానే సాగింది కానీ తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం నీలియా భవానీ చంద్రశేఖర్ కి దూరంగా ఉంటూ.. పిల్లలతో కలిసి జీవిస్తున్నారు.


ఈ అందాలరాశి నీలియా భవానీ పండగ చేస్కో, కిక్2, సైరా నరసింహారెడ్డి, జెంటిల్‌మెన్ చిత్రాల్లో నటించారు. కోలీవుడ్ స్టార్స్ అజిత్, విజయ్ సినిమాల్లోనూ ఆమె నటించారు. ప్రస్తుతం బుల్లితెర రంగంలో అనేక సీరియల్స్ తో ఆమె చాలా బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: