స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకాభిమానులు అందరి నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ఈ సినిమాలో పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్ర చేస్తుండగా హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక మందన్న ఒక గిరిజన యువతి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా విషయమై ఇటీవల నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ పుష్ప సినిమాని మొత్తం రెండు భాగాలుగా తీయనున్నామని అతి త్వరలో మొదటి భాగాన్ని విడుదల చేసి వచ్చే ఏడాది రెండో భాగాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు.

నిజానికి ఆగస్టు 13న విడుదల కావాల్సిన ఈ సినిమా మొదటి భాగం కరోనా కారణంగా వాయిదా పడి అక్టోబర్ కి షిఫ్ట్ అయినట్లు సమాచారం. ఇక రెండున్నరేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న భారీ పాన్ ఇండియా సినిమా కే జి ఎఫ్ చాప్టర్ 1. ఈ మూవీకి సీక్వెల్ గా ప్రస్తుతం కెజిఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలె ఫిలింస్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ టాలీవుడ్ నటులు రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా రవి బస్రూర్ సంగీతాన్ని భువన గౌడ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. నిజానికి ఈ సినిమా జులై 16న విడుదల కావాల్సి ఉండగా కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా దీనిని కూడా అక్టోబర్ కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

అయితే అసలు విషయం ఏమిటంటే అటు పుష్ప ఇటు కే జి ఎఫ్ చాప్టర్ 2, రెండూ కూడా అక్టోబర్ లో కేవలం వారం రోజుల గ్యాప్ లోనే విడుదల కానున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. అలానే ఈ సినిమాల రిలీజ్ డేట్ లని ఇటీవల ఫైనలైజ్ చేసిన మూవీ యూనిట్స్ అతి త్వరలో అధికారికంగా వెల్లడించనున్నాయని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదుగాని ఒకవేళ ఇదే కనుక నిజం అయితే అక్టోబర్ లో ఈ రెండు భారీ పాన్ ఇండియా మూవీస్ మధ్య భారీ బాక్సాఫీస్ క్లాష్ జరగడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: