బాలీవుడ్ ప్రముఖ సీనియర్ హీరో దిలీప్ కుమార్ ఆరోగ్యం అస్వస్థకు లోనయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా దిలీప్ కుమార్ తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం దిలీప్ కుమార్ ముంబై లోని హిందుజా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రంగా పరిణమిస్తున్న నేపథ్యంలో నాన్ కోవిడ్ హాస్పిటల్ లోనే జాయిన్ చేయించారు. మోస్ట్ సీనియర్ డాక్టర్స్ ఈయనకు చికిత్సను అందిస్తున్నారు. ఇప్పుడు దిలీప్ కుమార్ వయస్సు 98 సంవత్సరాలుగా కావడం వలన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  ఈయన గత రెండు నెలలుగా అనారోగ్య విషయమై ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

దిలీప్ కుమార్ ను మే లోనే హాస్పిటల్ లో జాయిన్ చేసి అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై బాలీవుడ్ సినిమా పరిశ్రమ ఆందోళన చెందుతోంది. ఇది ఇలా ఉంటే గత సంవత్సరమే తన ఇద్దరు బ్రదర్స్ ను కోల్పోవడంతో చాలా మనస్థాపానికి గురయ్యారు. దీనితో గత సంవత్సరం పుట్టినరోజును కూడా జరుపుకొలేదు. అప్పటి నుండి ఆ విషయం గురించే ఆలోచిస్తూ సంతోషమనే మాటే లేకుండా జీవిస్తున్నారు. ఇదేమైనా మనకు దక్కిన  ఈ చిన్న జీవితానికి దేవునికి కృతజ్ఞులై ఉండాలని తన భార్య సైరా భాను తెలిపారు.
 
దిలీప్ కుమార్ తన సినిమా జీవితాన్ని 1944 లో జ్వార్ భాటా అనే  చిత్రంతో స్టార్ట్ చేశారు. ఆ తరువాత 1947 లో వచ్చిన జుగ్ను చిత్రం ద్వారా మంచి పేరు వచ్చింది. దిలీప్ కుమార్  నటించిన చిత్రాలలో జోగన్, బాబుల్, ఆజాద్, దీదార్, ఆన్, కర్మ, ఫుట్ పాత్, డాగ్, దేవదాస్, మొఘల్ ఎ ఆజామ్ లు ఉన్నాయి. కాగా దిలీప్ కుమార్ తన జీవితానికి పుల్ స్టాప్ పెట్టింది ఖిలా అనే సినిమాతో, ఇది 1998 లో వచ్చింది. దిలీప్ కుమార్ ఆరోగ్యం త్వరగానే కుదుటపడి ఇంటికి తిరిగి రావాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: