మహేష్ బాబు ఈ మధ్య వరుస హిట్లను అందుకుంటూ దూసుకుపోతున్నాడు.ఆయన ప్రస్తుతం గీత గోవిందం దర్శకుడు పరశురాంతో కలిసి 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు.ఫాన్స్  ఎంతో ఎదురుచూస్తున్న  ఈ సినిమా షూటింగ్  సెకెండ్ షెడ్యూల్  కరోనా సెకండ్ వేవ్ వలన ఆగిపోయింది. ప్రస్తుతం పరిస్థితులు అంత మాములుగా అవ్వడంతో ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టాలి అని మూవీ టీం అనుకుంటున్నారట.


సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఇంకా ఆలస్యం అంతే ముందే ప్రకటించిన వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ డేట్ కి విడుదల అవ్వడం కష్టమే అని టాక్. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ అమెరికా లో మొదలుకాబోతుంది . ఈ షూటింగ్ కోసం మహేష్ బాబు అమెరికా కి ప్రయాణం అయ్యారు.ఈ మధ్య అమెరికాలో కూడా కరోన కేసులు తగ్గడంతో మూవీ టీం త్వరగా షూటింగ్ పూర్తి చేసుకోవాలని అనుకుంటున్నారు. 


ఇక ఈ సినిమాలో మహేష్ బాబు కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఆమె కి ఈ మధ్య సరైన హిట్ లేక కొంచెం ఇబ్బంది పడుతున్నారు.అయితే మహేష్ బాబు సినిమాతో అన్న కీర్తి కి హిట్ వస్తుందేమో ఆమె ఆశలు పెట్టుకుంటుంది. ఇక బ్యాంకింగ్ లో జరిగే అక్రమాల మీద ఈ సినిమా కథ ఉండబోతుంది అని టాక్. ఈ సినిమా కోసం థమన్ మంచి మాస్ సాంగ్స్ ఇచ్చారట. ఇప్పటికే సరిలేరు నికేవ్వరు సినిమాతో మంచి జోష్ మీద ఉన్న మహేష్ బాబు ఈ సినిమాతో ఇంకొక హిట్ తన ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నారట. అయితే మొన్న జరిగిన కృష్ణ గారి పుట్టినరోజు కి ఈ సినిమా టీజర్ విడుదల చేస్తారని అభిమానులు అనుకున్నారు కానీ అది జరగలేదు. అయితే మూవీ టీం త్వరలోనే ఈ సినిమా టీజర్ ని విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: