సాధారణంగా ఒక సినిమా నుంచి తప్పుకుని మళ్లీ అదే దర్శకుడితో సినిమా చెయ్యడం అంటే.. అదీ శంకర్ లాంటి దిగ్గజ దర్శకుడితో సినిమా అంటే అంత సులుభమేమీ కాదు. కానీ దిల్ రాజు గారు తెలివితేటలతో దాన్ని సెట్ చేసారు. మరి ఇదెలా సాధ్యమైందో తెలుసా..ఈ ముగ్గురి కాంబో సెట్ కావడానికి ఎన్. నరసింహరావు అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ నరసింహరావు ఎవరంటే శంకర్ వద్ద పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్. శంకర్ తో ఆయనకి కొన్నేళ్లగా స్నేహం ఉందట. ఆ కారణంగానే దిల్ రాజు ని శంకర్ తో కలిపి రామ్ చరణ్ తో ప్రాజెక్ట్ సెట్ చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.ఇక ఈ ప్రాజెక్ట్ ఓకే అవ్వగానే మెగా అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులని బద్దలు కొడుతుందని మెగా అభిమానులు భావిస్తున్నారు. ఈ కాంబో కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మరి శంకర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి