ప్రస్తుతం టాలీవుడ్ నుంచి భారీ పారితోషికం అందుకుంటున్న హీరో ప్రభాస్ అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. బాహుబలి సినిమా తో ఒక్కసారిగా పాన్ ఇండియా మార్కెట్ ను సంపాదించుకొని దేశంలోనే ఏ నటుడు అందుకోనీ విధంగా పారితోషికాన్ని తీసుకుంటున్నాడు. ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాల కు దాదాపు వంద కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ తాను చేసిన రాధే శ్యామ్ సినిమాను త్వరలో విడుదల చేస్తున్నాడు. 

సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా మాఫియా నేపథ్యంలో జరగబోతుంది. కే జి ఎఫ్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ ఈ సినిమాను కూడా ఆ రేంజ్ లో ఏమాత్రం తగ్గకుండా చేస్తున్నాడు. ఇక బాలీవుడ్ లో ఆది పురుష్ సినిమా ద్వారా అరంగేట్రం చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాకి కూడా ఆయన దాదాపు వంద కోట్ల పారితోషికం అందుకుంటున్నారట. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న సినిమాకి కూడా అదే రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట ప్రభాస్. 

ఈ నేపథ్యంలో ఆయన రేంజ్ కు కొంతమంది టాలీవుడ్ హీరోలు ఎదగాలని చూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ల తమ సినిమాలను పాన్ ఇండియా సినిమాలు గా రిలీజ్ చేస్తున్నారు ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలు. మీరు నలుగురు మాత్రమే కాకుండా ఇంకొంత మంది హీరోలు కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తూ దేశమంతటా మంచి మార్కెట్ ను క్రేజ్ ను తెచ్చుకునే విధంగా ప్లాన్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లు ఇప్పటికే 50 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అనుకుంటున్నారు. ప్రస్తుతం వారు చేస్తున్న పాన్ ఇండియా సినిమాలు కనుక పూర్తయ్యి విడుదలైతే తమ రెమ్యునరేషన్ డబ్బులు డబల్ చేయడం లో వారు ఏమాత్రం వెనుకాడరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: