తెలుగు చిత్ర సీమలో గాయని చిత్ర గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అంతలా తన గానంతో చిత్ర ప్రేక్షకుల్ని మైమరిచేలా చేస్తుంది. తాజాగా చిత్ర ఈ టీవీ లో ప్రసారమయ్యే అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చింది. ఈ సందర్భంగా ప్రముఖ కమెడియన్ అలీ చిత్రను అడిగిన చాలా ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పింది. తాజాగా విడుదల అయిన ఈ ప్రోమో చూస్తుంటే... చిత్ర ఈ షోలో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అలీ అడిగిన సరదా ప్రశ్నలకు గాయని చిత్ర సరదాగా జవాబులు చెప్పారు.

ఇప్పటి వరకు అన్ని భాషలలో కలిపి దాదాపు 20 వేల వరకు పాటలు పాడినట్టు పేర్కొన్నారు. తెలుగు భాషను దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వల్ల నేరుకున్నానని చెప్పారు. తన పాప పేరు మీద ఓ ట్రస్టును స్థాపించినట్లు పేర్కొన్నారు. ఈ ట్రస్టు ద్వారా పిల్లలు వదిలేసిన 60 ఏళ్లకు పైబడిన తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటున్నట్లు తెలిపారు. అరబిక్ సినిమాలోని పాటతో పాటు నాగార్జున నటించిన తెలుగు హిట్ మూవీ క్రిమినల్ సినిమా నుంచి కూడా ఓ గీతాన్ని ఆలపించారు. కేవలం పాటలు మాత్రమే కాకుండా హిట్ మూవీల్లోని డైలాగులు కూడా చెప్పి మెస్మరైజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ సినిమాల నుంచి పలు డైలాగులు చెప్పి ఆశ్చర్యపరిచారు. అలీ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ... తాను ఒక రోజులో అత్యధికంగా 16 పాటలు పాడినట్లు తెలిపారు. దానికి తన తల్లి తన మీద కోపం చేసినట్లు కూడా పేర్కొన్నారు. కాగా షో మొత్తం నవ్వులు పూయించిన చిత్ర ఓ సందర్భంలో మాత్రం కంటతడి పెట్టించింది. తాను నేషనల్ అవార్డు అందుకునే సమయంలో తన తండ్రి పక్కన లేకపోవడం బాధకలిగించిందని కన్నీరు పెట్టుకుంది. కాగా ఈ షో మొత్తం ఆగస్టు 2వ తేదీన ఈ టీవీ లో ప్రసారం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: