మెగాస్టార్ చిరంజీవి తో సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తీస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఆచార్య. మెగాస్టార్ తో పాటు మెగాపవర్ స్టార్ కూడా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, కాజల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా దీనిని ఇటీవల పలు దేవాలయ భూముల విషయమై జరిగిన ఒక సంచలన యదార్ధ కథకి దృశ్య రూపంగా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు కొరటాల శివ ఎంతో అద్భుతంగా తీస్తున్నట్లు టాక్. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

ఇటీవల చాలా వరకు షూటింగ్ జరుపున్న ఈ సినిమా నుండి కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అలానే లాహే లాహే సాంగ్ అన్ని కూడా ప్రేక్షకాభిమానులు నుండి మంచి క్రేజ్ దక్కించుకున్నాయి. అయితే ఈ సినిమా విడుదలపై చాలా రోజులుగా ఆలోచన చేస్తున్న యూనిట్, ఎట్టకేలకు మూవీ ని వచ్చే ఏడాది సంక్రాంతికి దీనిని బాక్సాఫీస్ బరిలో నిలిపేలా ఆలోచన చేస్తున్నట్లు టాక్. నిజానికి మూవీ ని ముందుగా దసరాకి విడుదల చేయాలని భావించినప్పటికీ సినిమాకి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఇంకా పెండింగ్ ఉండడం తో దానిని మరొక మూడు నెలలు వాయిదా వేసారట.
.
మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయి ఆచార్య మూవీ కనుక సంక్రాంతికి విడుదలైతే ఇప్పటికే ఆ సమయానికి రిలీజ్ ఫిక్స్ చేసుకున్న పలు బడా సినిమాల కలెక్షన్ కి ఒకింత గండి పడ్డట్లే అంటున్నారు విశ్లేషకులు. మరి మెగాస్టార్ ఆచార్య రిలీజ్ పై పక్కాగా అనౌన్స్ మెంట్ రావాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: