నందమూరి నటసింహం బాలకృష్ణ అలా ప్రకటించాడో లేదో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఎన్నాళ్లో వేచిన ఉదయం రాబోతోందనికలలుగన్నారు. కానీ బాలయ్య ప్రకటించి ఇన్నాళ్లు అవుతున్నా.. ఆ ప్రకటన ఇంకా అమల్లోకి రాలేదు. ఇంకా బాక్స్‌లోనే ఉండిపోయాయి. దీంతో బాలయ్య అభిమానులు కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు.

బాలక్రిష్ణ దర్శకత్వంలో మోక్షజ్ఞ తెరంగేట్రం చేస్తాటనే ప్రకటన వచ్చినప్పటి నుంచి నందమూరి అభిమానులు ఈ ప్రాజెక్ట్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  'ఆదిత్య 369' సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొడుకు ఎంట్రీ గురించి మాట్లాడాడు బాలయ్య. 'ఆదిత్య 999'తో మోక్షజ్ఞని లాంచ్‌ చేస్తానని, కథ కూడా సిద్ధమైందని చెప్పాడు.

'ఆదిత్య369' సీక్వెల్‌గా 'ఆదిత్య 999' సినిమా రాబోతోంది. ఈ మూవీకి బాలకృష్ణే స్వయంగా స్టోరీ లైన్‌ ఇచ్చానని చెప్పాడు. అలాగే ఈ సీక్వెల్‌ని అయితే సింగీతం శ్రీనివాసరావు, లేకపోతే నేనే డైరెక్ట్‌ చేస్తానని ప్రకటించాడు. ఈ ఒక్క సినిమాతో మోక్షజ్ఞని ఫుల్లుగా ట్రైన్‌ చేస్తానని చెప్పాడు. దీంతో తండ్రీకొడుకులు కలిసి నటిస్తే చూడాలని బాలకృష్ణ అభిమానులు ఆసక్తిగా ఎదురు  చేస్తున్నారు.

బాలకృష్ణ  ఇప్పుడు వరుస మూవీస్‌తో బిజీగా ఉన్నాడు. 'అఖండ' పూర్తవ్వగానే గోపీచంద్ మలినేని సినిమాలో జాయిన్‌ అవుతున్నాడు. ఈ మూవీస్‌తో పాటు మరికొన్ని ప్రాజెక్టులు కూడా పైప్‌లైన్‌లో ఉన్నాయనే టాక్ వస్తోంది. అంటే మోక్షజ్ఞ ఈ ఏడాది కూడా కెమెరాముందుకు రావడం కష్టమనే కామెంట్స్‌ వస్తున్నాయి. మరి 27 ఏళ్ల మోక్షజ్ఞ వచ్చే ఏడాదైనా సినిమాల్లోకి వస్తాడా అనేది చూడాలి. బాలయ్య ఫ్యాన్స్ మాత్రం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


నందమూరి ఫ్యామిలీలో.. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారక్ లు ఇప్పటికే వెండితెరపై తళుక్కుమన్నారు. మరి నందమూరి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చే మోక్షజ్ఞ ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తాడో చూడాలి. చూద్దాం.. ఆయన సినీ లైఫ్ ఎలా ఉంటుందో. మొక్షజ్ఞ వెండితెరపై తండ్రికి మించిన తనయుడిగా పేరు సంపాదించుకోవాలని ఆశిద్దాం..



 


మరింత సమాచారం తెలుసుకోండి: