సినిమా రంగంలో ఒక్కో సారి ద‌ర్శ‌కుల‌కు, నిర్మాత‌ల‌కు మ‌ధ్య గొడ‌వ‌లు వ‌స్తూ ఉండ‌డం కామ‌న్‌. అలాగే ద‌ర్శ‌కుల‌కు, హీరోల‌కు , హీరోల‌కు, హీరోయిన్ల‌కు మ‌ధ్య కూడా చిన్న చిన్న మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌స్తూ ఉంటాయి. ఈ కోవ‌లోనే ఓ టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్‌కు నిర్మాత‌కు మ‌ధ్య ఇప్పుడు జ‌రిగిన ఓ గొడ‌వ హాట్ టాపిక్ గా మారింది. ద‌ర్శ‌కుడు గౌత‌మ్ వాసుదేవ్  మీన‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న త‌మిళ్ తో పాటు తెలుగు లో కూడా స్టార్ హీరోల‌తో సినిమాలు చేశాడు.

కోలీవుడ్ లో అన్బు సెల్వన్ అనే తమిళ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవ‌లే విడుదలైంది. ఈ సినిమాలో హీరో గా విష్ణు విశాల్ న‌టిస్తున్నాడు. హీరో తో పాటు ద‌ర్శ‌కుడు పా . రంజిత్ ఈ సినిమా పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. పా .  రంజిత్ ఎవ‌రో కాదు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ తో కాలా , క‌బాలీ సినిమాలు తెర‌కెక్కించారు. ఈ పోస్ట‌ర్ రిలీజ్ అయ్యాక దానిపై గౌత‌మ్ మీన‌న్ స్పందించారు.

ఈ పోస్ట‌ర్ చూశాక అస‌లు ఇది తాను న‌టించిన సినిమా నా ? అస‌లు ఈ సినిమా గురించి త‌న‌కు ఎంత మాత్రం తెలియ‌ద‌ని.. ఇది నిజంగానే ఓ షాకింగ్ న్యూస్ అని చెప్పాడు. అస‌లు ఈ సినిమా పోస్ట‌ర్ పై ఉన్న ద‌ర్శ‌కుడు ఎవ‌రో కూడా త‌న‌కు తెలియ‌ద‌ని... అత‌డిని తాను ఎప్పుడూ క‌ల‌వ‌లేద‌ని కూడా బాంబు పేల్చారు.

అయితే దీనిపై ఈ సినిమా నిర్మాణ సంస్థ ఎంఎం స్టూడియోస్ తన యూట్యూబ్ ఛానెల్ లో కౌంటర్ వీడియో రిలీజ్ చేసింది. మ‌రి దీనిపై గౌత‌మ్ మీన‌న్ ఇప్పుడు ఎలా స్పందిస్తారో ?  చూడాలి. ఇక గౌత‌మ్ మీన‌న్ ఇటీవ‌ల ప‌లు సినిమాల్లో న‌టిస్తున్నారు. అలాగే శింబు న‌టిస్తోన్న ఓ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ వివాదం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: