తెలుగు చిత్ర పరిశ్రమకి అమ్మాయి కాపురం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నటి మహేశ్వరి. ఆమె తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆ సినిమా తరువాత మహేశ్వరి పెళ్లి, దెయ్యం, జాబిలమ్మ పెళ్లి వంటి హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్స్ లో ఒక్కరిగా రాణించారు.

ఆమె నటించిన సినిమాలో ముఖ్యంగా నవీన్ సరసన పెళ్లి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు.. ఈ సినిమాలో మహేశ్వరి తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా తరువాత మహేశ్వరి పలు సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇండస్ట్రీకి కొంత గ్యాప్ ఇచ్చిన తరువాత మహేశ్వరి ఇటీవల మళ్లీ బుల్లితెరపై కనిపించి సందడి చేశారు. ఆమె తాజాగా అలీతో సరదాగా షోతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ షోలో మహేశ్వరి తన కెరీర గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇక మహేశ్వరి మాట్లాడుతూ.. గులాబీ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని నేను ఊహించలేదని అన్నారు. ఆ చిత్రంలో  నా పాత్రకు నన్నే డబ్బింగ్ చెప్పమని కృష్ణవంశీ అనడంతో వర్మగారు కూడా అదే మాట చెప్పారని చెప్పుకొచ్చింది. అయితే షూటింగ్ సమయంలో నేను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదని.. దీంతో నాకు చాలా పొగరు అనుకున్నారని చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని కొంతమంది నా ముఖం ముందే చెప్పారని పేర్కొంది.

అంతేకాదు.. షూటింగ్ సమయంలో నేనేదో రామ, కృష్ణ అని ఒక పక్కన కూర్చుంటే శ్రీదేవి ఫ్యామిలీ నుంచి వచ్చింది కదా.. అందుకే అంత పొగరు అనుకున్నారని చెప్పుకొచ్చింది. అయితే  నిజానికి అంత సీనే లేదని అన్నది. ఇక గులాబీ సినిమా షూటింగ్ సమయంలో  మేఘాలతో తేలిపొమ్మన్నది సాంగ్ చేస్తున్నప్పుడు పెద్ద ఇష్యూ జరిగిందని తెలిపింది. సాంగ్ షూటింగ్ సమయంలో ఎదురుగా ఒక మారుతి వ్యాన్ రావాలని సమయంలో బైక్ స్కిడ్ అవడం.. లోయలో పడిపోవడం జరిగిపోయింది అంటూ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: