సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా వచ్చిన వారు అందరూ సత్తా చాటడం వీలు కాకపోవచ్చు. కొన్ని సార్లు ఎంత స్టార్ డం ఉన్నా, అభిమానులు కోకొల్లలుగా ఉన్నా సినిమాలు ప్లాప్ లుగా మిగిలి పోతుంటాయి. అలా అక్కినేని ఫ్యామిలీ నుండి ఎన్నో ఆశలతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కు ఇప్పటికీ సరైన హిట్ దొరక్క తడబడుతూనే ఉన్నాడు. అయితే గుడ్డిలో మెల్లలాగా మొన్నీమధ్యన వచ్చిన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" మూవీ ప్రేక్షకులను ఆకట్టుకున్నా అంతా గొప్ప విజయం అయితే కాదు. కాబట్టి ఇంకా తన కెరీర్ లో సాలిడ్ హిట్ కోసం వేట కొనసాగుతోంది. కాగా తాజాగా అఖిల్ నుండి వస్తున్న మూవీ "ఏజెంట్" ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది.

ఈ సినిమాకు దర్శకుడిగా సురేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఒక రాబరీ నేపధ్యంలో  సాగుతుందని సురేందర్ రెడ్డి హింట్ ఇచ్చారు. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ వచ్చింది. ఏ సినిమాలో అయినా హీరోకు ధీటుగా విలన్ ఉన్నప్పుడే వారిద్దరి మధ్య సన్నివేశాలు ఎంతగానో అలరిస్తాయి. అందుకే ఈ సినిమాలో విలన్ గా ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని ఎంచుకున్నారు. అయినా మరొక ఇద్దరిని కూడా ఎంపిక చేశారు డైరెక్టర్. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది పినిశెట్టి ఎలాంటి పాత్రనైనా అలవోకగా పోషించగలడు అని నిరూపించుకున్నాడు. అంతే కాకుండా అఖిల్ బాడీ లాంగ్వేజ్  కు సూట్ అవుతాడని ఆదిని విలన్ గా అనుకున్నారు.

ఇక ఇందులో మరో విలన్ గా బాలీవుడ్ నటుడు మరియు కరోనా సమయంలో ఆపద్బాంధవుడిగా మారిన సోను సూద్ ను తీసుకున్నారు. ఈ వార్త తెలిసిన అఖిల్ అభిమానులు ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నారు. అలా ఈ సినిమాలో అఖిల్ మొత్తం ముగ్గురిని ఢీ కొట్టనున్నాడు అని తెలుస్తోంది. దీనితో రోజు రోజుకి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి చూద్దాం ఈ సినిమా అంచనాలను అందుకుంటుందో  లేదా?

మరింత సమాచారం తెలుసుకోండి: