టాలీవుడ్ లో వెరైటీ సినిమాల్లో చేసే హీరోగా ఉన్నాడు అడవి శేష్. ఎలాంటి నేపథ్యం లేకుండా సినిమా పరిశ్రమకు హీరోగా వచ్చి మంచి మార్కెట్ కలిగిన కథానాయకుడిగా ఎదిగిన వారిలో అడివి శేష్ కూడా ఒకరు. చిన్న చిన్న వేషాలు వేస్తూ తన కెరీర్ను ప్రారంభించిన ఆయన క్షణం, గూడచారి వంటి సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా తాజాగా రూపొందించిన మేజర్ సినిమా జూన్ 3వ తేదీన విడుదల కానుంది.

 ఈ నేపథ్యంలో ఆయన ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగం గా ఓ టీవీ షో లో పాల్గొన గా తన కెరియర్ కు సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు శేష్. తన వ్యక్తిగత విషయాలతో పాటు ప్రొఫెషనల్ విషయాలను కూడా ఆయన ఈ కార్యక్రమంలో వెల్లడించారు. తాను సినిమా ఇండస్ట్రీకి రావడానికి తన పేరెంట్స్ సపోర్ట్ ఎంతో ఉపయోగపడింది అని చెప్పారు. తనకు ఇండస్ట్రీ లో ఎవరూ లేరని పరిచయం అయిన అందరూ కూడా తనకు ఎంతో సపోర్ట్ గా నిలిచారు అని ఆయన చెప్పారు. క్షణం సినిమా సమయం లో అల్లు అర్జున్ ట్వీట్ చేయడం ఎప్పుడు మర్చిపోలేను అని వెల్లడించారు. అప్పటి వరకు తన సినిమాలకు సంబంధించిన మాత్రమే అల్లు అర్జున్ ట్వీట్ చేసేవారు.

మొదటిసారిగా నా సినిమా గురించి ఆయన ట్వీట్ చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. అప్పటినుంచి మంచి కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్లాను అని ఆయన అన్నారు. ఇప్పుడు మహేష్ బాబు గారి సపోర్ట్ మర్చిపోలేనని కూడా ఆయన చెబుతున్నారు. మేజర్ సినిమా కు ఆయన ఇచ్చిన సపోర్ట్ అలాంటిది అన్నారు. ఈ కథను వినగానే మహేష్ బాబు గారికి చెప్పి ఒప్పించడం తన జీవితంలో ఓ మైలురాయి అని ఆయన వెల్లడించారు. మరి వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమా అడవి శేష్ ఏ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకు వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: