దింతో ఈ సినిమా ప్రదర్శన నిలిచిపోయిన సంగతి అందరికీ తెలిసినదే.. ఈ వివాదంలో జీవిత రాజశేఖర్ శేఖర్ చిత్రబృందం సభ్యులకు అనుకూలంగా కోర్టులో న్యాయ స్థానం మాట్లాడినట్లుగా సమాచారం అందుతోంది. శేఖర్ చిత్రం ప్రదర్శన నిలిపి వేయాలని తానెప్పుడూ చెప్పలేదని న్యాయస్థానం తెలియజేసినట్లు తెలిపింది. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే సినిమా ప్రదర్శనను ఆటంకం కలిగిస్తున్నారని రాజశేఖర్ తెలియజేశారు. కానీ ఈ సినిమాని నిలిపివేయాలని కోర్టు నుంచి ఎటువంటి అభ్యంతరం లేదని తెలియజేశారు న్యాయ సంస్థ. శేఖర్ చిత్రాన్ని ఎటువంటి అభ్యంతరం లేకుండా ప్రదర్శించు కోవచ్చని న్యాయస్థానం తెలియజేసింది.
జీవిత రాజశేఖర్ నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరఫు న్యాయవాదులు విలేకర్ల సమావేశంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. దీంతో జీవిత రాజశేఖర్ శేఖర్ చిత్రాన్ని నిరభ్యంతరంగా ప్రదర్శించు కోవచ్చని న్యాయస్థానం తెలియజేయడంతో కాస్త ఈ సినిమా నుంచి ఊరట లభిచిందని చెప్పవచ్చు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ చిత్ర ఎంతటి కలెక్షన్లను రాబడుతోంది తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.