హీరోగా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వరుస విజయాలను అందుకుంటున్నాడు వరుణ్ తేజ్. మెగా హీరోగా ఆయన సినిమా పరిశ్రమలోకి వచ్చినప్పటికీ ఎలాంటి పాత్రనైనా చేయగల నటుడిగా ఎదిగాడు. తొలి సినిమా నుంచి ఆయన తన ప్రత్యేకతను చూపించడం మొదలు పెట్టాడు. అలా ఇటీవల కాలంలో ఏ హీరోకి దక్కనటువంటి విజయాలతో ముందుకు దూసుకుపోతున్న ఈ హీరో గని సినిమాతో చాలా రోజుల తర్వాత పరాజయాన్ని ఎదుర్కొన్నాడు.

బాక్సింగ్ నేపథ్యంలోనీ ఈ సినిమా రొటీన్ సినిమాగా ప్రేక్షకుల విమర్శలను ఎదుర్కొంది. ఆ తర్వాత వెంటనే ఆయన అప్పటికే పూర్తి చేసిన ఎఫ్3 సినిమాను విడుదల చేసి ఆ ఫ్లాప్ ను అందరూ మరిచిపోయేలా చేసుకున్నాడు. ఆ సినిమా ఎంత మంచి విజయం అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆయన సోలో హీరో కాకపోయినా కూడా తన నటన తో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఆయన చేయబోయే సినిమాపై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వకపోవడం నిజంగా ఆయన అభిమానులను ఎంతగానో కలవరపరిచే విషయం అని చెప్పాలి.

ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. తప్ప దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావడం లేదు. దాంతో ఈ సినిమా ఉంటుందో లేదో అన్న అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు వరుణ్ తన తదుపరి సినిమా ను బాలీవుడ్ చిత్ర దర్శకుడితో చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా సినిమా చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మరి త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రానుంది. చాలామంది హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలను చేసే విధంగా ముందుకు వెళ్లడంతో ఈ హీరో కూడా ఆ సినిమాలు చేయాలని భావించి బాలీవుడ్ దర్శకుడు వెంట పడుతున్నారు. మరి అలాంటి సినిమాలు చేసే టాలీవుడ్ దర్శకులు పై ఆయన ఎందుకు నమ్మటం లేదో అర్థం కావడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: