ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే పోయిన సంవత్సరం విడుదల అయిన పుష్ప ది రైస్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని దేశ వ్యాప్తంగా అదిరిపో యే క్రేజ్ ని సంపాదించుకున్నాడు. మరి కొన్ని రోజుల్లోనే పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. పుష్ప ది రూల్ షూటింగ్ ప్రారంభం కాక ముందే అల్లు అర్జున్ తన తదుపరి మూవీ లకు సంబంధించిన లైన్ అప్ ని సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఒక టాలీవుడ్ డైరెక్టర్ లైన్ లో పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అసలు విషయం లోకి వెళితే ..  తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ "పుష్ప ది రూల్" మూవీ తర్వాత సినిమా చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ,  అల్లు అర్జున్ కు ఇది వరకే ఒక కథను వినిపించగా ,  ఆ కథ అల్లు అర్జున్ కు బాగా నచ్చినట్లు తెలుస్తోంది. అదే కథతో  పుష్ప ది రూల్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక మూవీ సెక్స్ పైకి వెళ్ళనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే గతంలో అల్లు అర్జున్ ,  త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో జులాయి ,  సన్నాఫ్ సత్యమూర్తి , అలా వైకుంఠపురంలో అనే మూడు మూవీ లు తెరకెక్కి , ఈ మూడు మూడు మూవీ లు కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకొని ,  మంచి కలెక్షన్ లను కూడా రాబట్టాయి. వీరిద్దరి కాంబినేషన్ లో మరి కొద్ది రోజుల్లో 4 వ మూవీ కూడా రాబోతునట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: