రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కృతి సనన్ ప్రభాస్ కి జోడిగా నటించగా ... బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు గల దర్శకులలో ఒకరు అయినటువంటి ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటువంటి సైఫ్ అలీ ఖాన్మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో అత్యంత భారీ ఎత్తున విడుదల అయింది. ఇకపోతే అత్యంత భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమాకు భారీ కలెక్షన్ లు వచ్చినప్పటికీ ఈ మూవీ కి భారీ ఎత్తులో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో ఆ స్థాయి షేర్ కలక్షన్ లను ఈ సినిమా అందుకోకపోవడంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్న ఈ సినిమా ఇప్పటికే "ఓ టి టి"  లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించడానికి రెడీ అయింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఈ మూవీ యొక్క హిందీ సాటిలైట్ హక్కులను సోనీ మ్యాక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ ను సోనీ మాక్స్ ఛానల్లో అక్టోబర్ 21 వ తేదీన రాత్రి 7 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయనున్నట్లు ఈ ఛానల్ తాజాగా ప్రకటించింది. మరి ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: