![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/socialstars-lifestyle1b4ebe41-729f-4c38-83f6-1b4fb8c3a20d-415x250.jpg)
అయితే ఆమె మరణం నుంచి చందూ ముభావంగా ఉంటున్నాడు. ఆమె మరణించిన రోజు నుంచి ఎక్కడా కనిపించడం లేదు. మిత్రులకు, బంధువులకు, తోటి నటులకు కూడా చందు టచ్లోకి రాలేదు. ఈ క్రమంలో అనూహ్యంగా శుక్రవారం సాయంత్రం అతడు అల్కాపురి కాలనీలోని తన ప్లాట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త సీరియల్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.పవిత్ర జయరాం మృతి చెందిన వారం రోజులకే చందూ బలవన్మరణానికి పాల్పడడం పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇద్దరి మరణంతో పరిశ్రమలో తీవ్ర విషాదం నిండింది. అయితే వెంటవెంటనే మరణాలు సంభవించడం వెనుక చాలా అనుమానాలు వస్తున్నాయి. పవిత్ర జయరాం మరణం తట్టుకోలేక చందూ ఆత్మహత్య చేసుకున్నాడని బయట వినిపిస్తున్న మాట. కానీ అతడి మరణం వెనుక చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. పవిత్ర జయరాంతో చందూకు వివాహేతర సంబంధం ఉందనే ప్రచారం జరుగుతోంది. వారిద్దరూ సహజీవనం చేస్తున్నారని చర్చ జరుగుతోంది. పవిత్రను అమితంగా ప్రేమిస్తున్న చందూ ఆమె అకాల మరణంతో దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఆమె లేని జీవితం తనకు వద్దని భావించి ఆత్మహత్య చేసుకున్నాడని వినిపిస్తోంది. కానీ ఇవన్నీ పుకార్లేనని బంధుమిత్రులు, తోటి నటీనటులు చెబుతున్నారు. అయితే పోలీసుల విచారణలో వాస్తవ విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు విచారణ చేపడుతున్నారు. త్వరలోనే అసలు విషయాలు వెలుగులోకి రానున్నాయి.