టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటీ మణులలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ నితిన్ హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన "అఆ" అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని , మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత ఈమె చాలా సినిమాలలో నటించి ఎన్నో మూవీలతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకుంది. ఇకపోతే ఈ రోజు అనగా సెప్టెంబర్ 12 వ తేదీన ఈమె నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఒక సినిమా థియేటర్లలో విడుదల కాగా , మరో సినిమా ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అసలు అనుపమ పరమేశ్వరన్ నటించిన ఏ సినిమా థియేటర్లలో విడుదల అయింది ..? ఏ సినిమా ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇచ్చింది అనే వివరాలను తెలుసుకుందాం.

అనుపమ పరమేశ్వరన్ కొంత కాలం క్రితం పరదా అనే సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. లేడీ ఓరియంటెడ్ మూవీ గా రూపొందిన ఈ సినిమాలో అనుపమ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇకపోతే ఈ మూవీ ఈ రోజు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా అనుపమ "కిష్కిందపురి" అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ఈ రోజు అనగా సెప్టెంబర్ 12 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఇలా అనుపమ ఓ సినిమాతో థియేటర్లలో హంగామా చేస్తూ , మరో సినిమాతో ఓ టీ టీ లో హంగామా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: