ఇంతకీ ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారు అనేది ఇప్పుడు అభిమానులలో హాట్ టాపిక్గా మారింది. తాజా వార్తల ప్రకారం, ఈ మల్టీస్టారర్ సినిమాలో హీరోయిన్లుగా నయనతార మరియు త్రిష ఎంపికయ్యారట. ఇది విన్న వెంటనే అభిమానుల్లో కొత్త ఎగ్జైట్మెంట్ మొదలైంది.గతంలో నయనతార మరియు త్రిష మధ్య వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా కొన్ని టెన్షన్లు ఉన్నాయని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఆ ఇద్దరూ ఒకే సినిమాలో నటించబోతున్నారని తెలిసి చాలామంది షాక్ అవుతున్నారు. కొందరు “ఇంతకాలం తర్వాత ఇలాంటి కాంబినేషన్ ఊహించలేదు” అంటున్నారు.
ఇక సోషల్ మీడియాలో ఈ వార్తలు పూర్తిగా వైరల్ అయ్యాయి. రజనీకాంత్–కమల్ హాసన్ కాంబినేషన్ అంటేనే ఒక సూపర్ హైప్. దానికి నయనతార, త్రిష వంటి స్టార్ హీరోయిన్ల యాడిషన్ అంటే ఈ సినిమా రికార్డులను తలకిందులు చేసే అవకాశం ఉంది. సినిమా పెద్ద స్థాయిలో తెరకెక్కించడానికి ప్రొడ్యూసర్లు కూడా భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారట. హాలీవుడ్ స్టైల్లో యాక్షన్ సీక్వెన్స్లు, ఇంటర్నేషనల్ టెక్నికల్ టీమ్తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారన్న ప్రచారం కూడా ఉంది.ఫ్యాన్స్ మాత్రం ఈ ప్రాజెక్ట్పై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు “ఇది డ్రీమ్ కాంబినేషన్.. ఈ తరహా సినిమా మళ్లీ చూడలేము” అంటుంటే, మరికొందరు మాత్రం “ఇద్దరూ సీనియర్ హీరోలు.. ఇప్పుడు ఈ కాంబినేషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి” అంటున్నారు.ఏమైనా సరే, రజనీ–కమల్ మల్టీస్టారర్ మూవీ అనగానే దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి తెరపై కనిపించే రోజు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి