తెలుగు సినీ ఇండస్ట్రీలో నాచురల్ బ్యూటీగా పేరు సంపాదించిన సాయి పల్లవి తనకు పాత్ర నచ్చితే ఏ భాషలోనైనా నటించడానికి సిద్ధంగానే ఉంది. సాయి పల్లవి తన అందం, అభినయంతో ,డాన్స్ మూమెంట్స్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. అలా ఎన్నో చిత్రాలు తన వల్లే సక్సెస్ అయ్యాయి. ఇలాంటి తరుణంలో కూడా భారీ బడ్జెట్ సినిమా ఆయన రామాయణ చిత్రంలో సీత పాత్రలో కనిపించబోతోంది. అయితే ఈ సినిమా కంటే ముందుగా అమీర్ ఖాన్, సన్ జునైద్ ఖాన్ హీరోగా రాబోతున్న ఏక్ దిన్ టైటిల్ తో నెట్ ఫ్లిక్స్ లో నవంబర్ 7న విడుదల కావాల్సి ఉండగా, ఆ తర్వాత టైటిల్ మేరీ రహోగా మార్చడం జరిగింది. డిసెంబర్ 12న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు.


ఆ తర్వాత మళ్లీ ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే కనిపించలేదు. కనీసం హీరో హీరోయిన్స్ కి సంబంధించి ఎలాంటి లుక్స్ కూడా బయటికి రాలేదు. సినిమా విడుదలకు కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉన్నప్పటికీ ఎలాంటి ప్రమోషన్స్  కూడా చేపట్టలేదు చిత్ర బృందం. అసలు ఈ సినిమా ఏడాది రిలీజ్ అవుతుందా? అనే విషయంపై ఇప్పుడు బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో సాయి పల్లవి తనని తాను నిరూపించుకోవడానికి సిద్ధమయ్యింది.


అలాగే భారీ బడ్జెట్ మూవీ రామాయణ రెండు భాగాలలో తెరకెక్కిస్తూ ఉండగా అందులో సీత పాత్రలో కనిపించబోతోంది. ఇందులో రాముడు గెటప్ లో రణబీర్ కపూర్ నటిస్తున్నారు. మరి  సాయి పల్లవి సీత పాత్రలో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి. మేరీ రహో సినిమాలో సాయి పల్లవి బాలీవుడ్ కెరియర్ కి ప్లస్ అవుతుందో చూడాలి. చివరిగా సాయి పల్లవి తెలుగులో నాగచైతన్య నటించిన తండేల్ చిత్రంలో నటించింది. ఆ తరువాత తెలుగులో మళ్లీ ఎటువంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.ప్రస్తుతం సాయి పల్లవి ఫోకస్ మొత్తం రామాయణ సినిమాలోని సీత పాత్ర మీదే ఉందని అందుకే తదుపరి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: