గతంలో ఎన్నో క్లాసికల్ మూవీస్ ని నిర్మించి, తన సొంత శైలితో సినీప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన దిగ్గజ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ గారి దర్శకత్వంలో ఓ కొత్త సినిమాను నాగ్ అశ్విన్ ప్రొడ్యూస్ చేయబోతున్నారని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే జాతిరత్నాలు వంటి సూపర్ హిట్ కామెడీ డ్రామాను అనుదీప్ కెవి దర్శకత్వంలో నిర్మించి నిర్మాతగా కూడా విజయాన్ని రుచి చూసిన నాగ్ అశ్విన్, ఇప్పుడు సింగీతం శ్రీనివాసరావుతో కలిసి ఒక భిన్నమైన ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఏ జానర్లో ఉంటుందో, ఇందులో ఏ టచ్ మసాలా ఉంటుందో, ఇప్పటి తరానికి సింగీతం శ్రీనివాస్ గారి దర్శకత్వంతో ఏ విధమైన కొత్త కథను అందించబోతున్నారో అన్నది ఇప్పుడు సినీప్రియులలో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
భారతీయ సినిమా ఇండస్ట్రీలో ప్రయోగాలకు, నవీనతకు నిలువెత్తు నిదర్శనం అయిన సింగీతం శ్రీనివాస్ గారి దర్శకత్వం గా రి రీ-ఎంట్రీ వంటి ఈ ప్రాజెక్ట్, నాగ్ అశ్విన్ ప్రొడక్షన్ వల్ల మరింత గ్రాండ్గా రూపుదిద్దుకోనుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ లెజెండరీ కాంబినేషన్పై ఇప్పటికే టాలీవుడ్లో హాట్ టాపిక్గా చర్చ ప్రారంభమైంది. నాగ్ అశ్విన్ నిర్మించబోతున్న ఈ ప్రత్యేక చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి