మలయాళ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటువంటి దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన తాజాగా కాంతా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా నటించగా ... టాలీవుడ్ నటుడు రానామూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఏడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ప్రపంచ వ్యాప్తంగా కంప్లీట్ అయింది. ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కి మంచి టాక్ రాలేదు. దానితో ఈ మూవీ కి ఇప్పటివరకు తెలుగు రాష్ట్రంలో పెద్ద స్థాయి కలెక్షన్లు దక్కలేదు. మరి ఏడు రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఎన్ని కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.



7 రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 1.55 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 27 లక్షలు , ఆంధ్ర లో 1.52 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 7 రోజుల్లో కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.34 కోట్ల షేర్ ... 6.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 8.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మరో 6.16 కోట్ల షేర్ కలెక్షన్లను సాధిస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: