టాలీవుడ్ లో కెరటం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది మోడల్, నటి రకూల్ ప్రీత్ సింగ్. మొదటి సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో తెలుగు లో అవకాశాలు వస్తాయా అన్న అనుమానాలు వచ్చాయి. కానీ ఆ అమ్మడి అదృష్టం సందీప్ కిషన్ తో భలే కలిసి వచ్చింది. ఈ జంట నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత తెలుగు దర్శక, నిర్మాతల కన్ను రకూల్ పై పడింది. గ్లామర్ పరంగా దేనికైనా సిద్దమైన ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగు హీరోల సరసన వరుసగా నటిస్తూ మంచి విజయాలు అందుకుంది. అప్పట్లో తమ పక్కన రకూల్ అయితే బాగా సెట్ అవుతుందని హీరోలు చెప్పే స్థాయికి ఈ అమ్మడు పేరు తెచ్చుకుంది.
తెలుగు, తమిళ భాషల్లో మంచి జోరు మీదు ఉన్న రకూల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో సైతం తన సత్తా చాటే ప్రయత్నం కూడా చేసింది. తెలుగులో ఇటీవల అవకాశాలు బాగా తగ్గాయని తెలుస్తుంది. గత ఏడాది కింగ్ నాగార్జున నటించిన ‘మన్మథుడు2’ మూవీలో నటించింది. కానీ ఈ మూవీ భారీ డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం తమిళంలో ఒకటీ రెండు మూవీస్.. బాలీవుడ్ లో నటిస్తుంది. ఆ మద్య అజయ్ దేవ్గన్తో 'దేదే ప్యార్ దే' అనే సినిమా చేసింది. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే అదరగొట్టింది.
తెలుగు ఏ చిన్న ఛాన్స్ దక్కినా అల్లుకు పోతుంది. అయితే ఈ బ్యూటీ పంజాబీ అయినా.. హైదరాబాద్ లోనే స్థిరపడింది. ఇక్కడ కొన్ని వ్యాపరాలు కూడా నిర్వహిస్తుంది. నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ అప్ కమింగ్ హీరోలకైనా అంటుంది. తాజాగా రకూల్ పింక్ డ్రెస్ లో తన ఎదఅందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కించే ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.