మహిళలను ఎంతో గౌరవించే సంస్కృతి మన భారతీయులది. కానీ కాలం మారుతుంది... టెక్నాలజీ పెరుగుతుంది... ఆధునిక పోకడలు వస్తున్నాయి... సంస్కృతి మంట కలుస్తుంది... మానవత్వం గంగలో కలిసిపోతుంది. ఎంతో అపురూపంగా చూడాల్సిన మహిళలకు రక్షణ కరువై పోయింది. ఇది మహిళలను గౌరవించే నా భారతదేశం అని గర్వంగా చెప్పుకునే రోజు నుంచి భారతదేశంలో అసలు మహిళలు దేశంలో  బతకగలరా అనే రోజులు వచ్చాయి. ఎక్కడ చూసినా కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాల్లాంటి మగాళ్లే . మంచివాళ్ళ ముసుగులో  సమయం కోసం ఎదురు చూస్తూ.... సందర్భం రాగానే కామంతో పశువాంచ తీర్చుకునే కామందులు. కామాంధులు తప్ప సమాజంలో మనిషి ఎక్కడా కనిపించడం లేదు. మానవత్వ విలువలు మచ్చుకైనా కనిపించడం లేదు. 

 

 

 మహిళలపై రోజురోజుకూ లైంగిక దాడులు జరుగుతున్నాయి... ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు మాత్రం ఆగటం  లేదు. నిందితులను కఠినంగా శిక్షించిన  కనీసం కామాంధుల వెన్నులో వణుకు పుట్టడం లేదు. దీంతో మహిళలు రోజురోజుకు ప్రశ్నార్ధక జీవితాన్ని గడుపుతున్నారు. రోడ్డుపై నడిచే ఆకతాయిల నుంచి.. చదువుకోడానికి వెళ్తే కామందుల ముసుగులో ఉన్న గురువుల నుంచి... ఉద్యోగానికి వెళితే మంచి వాళ్ళ ముసుగులో ఉన్న సహోద్యోగుల నుంచి... ఎక్కడ రక్షణ లేదని ఇంటికి వస్తే రక్తం పంచుకుని పుట్టిన సొంత వారి  నుంచి మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. 

 

 

 తాజాగా సభ్యసమాజం తలదించుకునే ఘటన మరొకటి జరిగింది. ట్యూషన్ కోసం ఇంటికి వచ్చిన ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు సదరు ట్యూటర్. ఈ ఘటన లక్నోలోని ముజఫర్ నగర్ లో వెలుగులోకి వచ్చింది. సదరు ట్యూటర్ భార్య తన భర్త నిర్వాకాన్ని బయటపెట్టడంతో కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుని అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోశారు. ట్యూషన్ కోసం వస్తున్న మైనర్ బాలికను ప్రేమ పేరుతో వల వేసి ఆ తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతే కాకుండా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తన భర్తతో  అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ ఏకంగా ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చిందని నిందితుడి భార్య వెల్లడించింది. కాగా సదరు మైనర్ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: