దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు భారత ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. జనతా కర్ఫ్యూ పేరుతో  ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. మార్చి 22 నుంచి  ప్రారంభమైన ఈ కర్ఫ్యులో భాగంగా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. అంతేకాకుండా కరోనా ప్రభావం మరింత పెరుగుతుండటంతో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించింది. 

 

 

 

కరోనా వ్యాప్తి ఎంతగా అరికట్టిన ప్రభుత్వ చర్యలను తిప్పి గొడుతూ తన పంజాను విసురుతూ వస్తుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ప్రజలు స్వచ్చందంగా బంద్ ను పాటిస్తున్నారు. లాక్ డౌన్ లో భాగంగా దుఖాణాలు, అలాగే అన్నీ సంస్థలు మూతబడ్డాయి. సినిమా హాళ్లు, సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలెబ్రెటీలు కూడా వారిలో ఉన్న సొంతకళలను బయట పెడుతున్నారు. 

 

 


కరోనా ప్రభావంతో జరగ వలసిన ఐపీయల్ మ్యాచ్ లు కూడా రద్దయిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు క్రికెటర్లు టిక్ టాక్ లు  చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరో కొందరు  గడుపుతున్నారు. ఈ సందర్బంగా ఇంట్లో పనులను కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఈ మేరకు భారత క్రికెట్ దిగ్గజం శిఖర్ ధావన్ తన ఇంట్లో పనిచేసుకుంటూ వస్తున్నాడు. 

 

 

 

అసలు విషయానికొస్తే శిఖర్ ధావన్ ఇంట్లో మరుగుదొడ్డి శుభ్రం చేస్తూ, బట్టలు ఉతుకుతూ భారత క్రికెట్ ఆటగాడు శిఖర్‌ ధావన్‌ తీసుకున్న వీడియో వైరల్‌ అవుతోంది.తన భార్య ఆయేషాతో కలిసి ధావన్ ఈ ఫన్నీ వీడియో తీసుకున్నాడు.ఆమె కర్ర పట్టుకుని మందలిస్తుండగా ధావన్‌ ఆమెకు భయపడుతున్నట్లు నటిస్తూ ఇంటిని శుభ్రం చేస్తున్నాడు. ఆ సమయంలో ఫోనులోనూ మాట్లాడుతూ బిజీగా ఉన్నట్లు ఆయేషా కనపడుతుంది. అన్ని పనులు భర్తకు చెబుతూ ఆమె మేకప్‌ వేసుకుంటోంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: