ప్రస్తుతం
టిడిపి లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నాయకులు రాజకీయ భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తున్న వారు
బిజెపి వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా, మరికొంతమంది
టీడీపీ అధినేత చంద్రబాబు సూచనల మేరకు బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా
రాజ్యసభ సభ్యుడు
సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ
వెంకటేష్ తదితరులు బీజేపీలో చేరారు . బిజెపిలో చేరిన దగ్గర నుంచి సుజనాచౌదరి
వైసీపీ ని టార్గెట్ చేసుకుంటూ అనేక విమర్శలు చేస్తున్నారు. ఇటీవల
ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్
కుమార్ వ్యవహారంలోనూ
సుజనా చౌదరి రమే ఉన్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఇదంతా టీడీపీకి అనుకూలంగా సుజన చక్రం తిప్పేందుకు ఇలా వ్యవహరించారనే విమర్శలు ఆయన మీద ఉన్నాయి. ప్రస్తుతం
టీడీపీ నుంచి బీజేపీలో కి వెళ్ళినవారు, ప్రస్తుతం
వైసిపి,
టిడిపి నుంచి
బిజెపి లోకి వెళ్లాలని చూస్తున్న వారిపైన
వైసీపీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి
విజయసాయి రెడ్డి తనదైన శైలిలో
ట్విట్టర్ వేదికగా పంచ్ వేశారు." ఏడాదికాలంగా తినడానికి ఏమీ దొరక్క నకనక లాడుతున్న
టిడిపి మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోంది. ఇప్పటికే కొన్ని మిడతలు ఆ పార్టీలో చేరి విధ్వంసం సృష్టిస్తున్న విషయం గ్రహించే లోగానే, మిగతావి ఎగురుకుంటూ బయలుదేరాయి. ఈ విపత్తు నుంచి
బీజేపీ ఎలా బయటపడుతుందో చూడాలి" అంటూ
విజయసాయి రెడ్డి తనదైన శైలిలో పంచ్ పేల్చారు.
అవసరాల కోసం స్వార్థంతో జెండాలు మార్చే వారంతా లిటిగేటర్ల అవతారం ఎత్తుతున్నారని
విజయసాయి రెడ్డి విమర్శించారు. ప్రజా తీర్పును అపహాస్యం చేయాలని చూస్తే ఏ వ్యవస్థ ఉపేక్షించదని హెచ్చరించారు. అలా చేస్తే
మీడియా ఎంటర్టైనర్ లుగా మిగిలిపోవడం మినహా సాధించేది ఏమీ ఉండదని, పతనమైన విలువలకు ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్న
ఏపీ సీఎం
జగన్ ను ఏ శక్తులు అడ్డుకోలేదని ఈ సందర్భంగా విజయ సాయి
రెడ్డి చెప్పారు.