ఇది కూడా సాక్ష్యాత్తు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇంటికి దగ్గరగా జరగడంతో రాజకీయంగా పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఈ హత్యకు సంబంధించి మీడియా జర్నలిస్టులు వరుస ప్రశ్నలు అడుగుతూ ఉండడంతో, వాటికి సమాధానాలు చెప్పలేక ఒకానొక దశలో వారిపై మాటల దాడికి దిగారు. మాములుగా అయితే ఎంత పెద్ద నాయకుడైనా మీడియా ముందు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంది. మన భారత ప్రధాని మోదీ కూడా ఎక్కువగా మీడియా ముందు మాట్లాడడానికి ఇష్టపడరు. అందుకే ఈయన ఎప్పటికప్పుడు తన సందేశాన్ని సామాజిక మాధ్యమాల రూపంలో తెలియచేస్తూ ఉంటారు.
ఇందుకు పూర్తి భిన్నంగా నితీష్ కుమార్ జర్నలిస్టులపై తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. జర్నలిస్టులుగా మీరు ఎవరికి మద్దతుగా ఉన్నారని వారిని నిలదీసి అడిగారు. మీరు ఎవరిని ఎలాంటి ప్రశ్నలు అడగాలో తెలుసుకోండి...ఇలాంటి ప్రశ్నలు అడగడం సబబు కాదు అని వారిని తిరిగి ప్రశ్నించారు. మీ మాటలు పోలీసులను కించపరిచేలా ఉన్నాయని, 2005 కు ముందు కూడా ఎన్నో నేరాలు మరియు హింసాత్మక ఘటనలు జరిగాయి...ఇదే విధంగా వాటి గురించి మీరెందుకు ప్రశ్నించరు అని దుయ్యబట్టారు. మరి ఈ వ్యాఖ్యలపై జర్నలిస్టుల సంఘం ఏమైనా చర్య తీసుకుంటుందా..? ఏవిధంగా స్పందించనుంది తెలియాల్సి ఉంది.