ఈ మధ్య కాలంలో మానవ  బంధాలకు ఎవరు కూడా కాస్త అయినా విలువ ఇవ్వడం లేదు అన్న విషయం తెలిసిందే. బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వకుండా వింత  నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మహిళా  గురించి గతంలో అందరూ చదివే ఉంటారు. గత ఏడాది జూలైలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన మహిళ ఈమె. ఎందుకు వైరల్ గా మారిపోయింది అని అంటారా..  ఎందుకంటే బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వకుండా.. భర్తకు విడాకులు ఇచ్చి కొడుకుని పెళ్లి చేసుకుంది ఈ మహిళ.



 ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. రష్యా లో  వెలుగు లోకి వచ్చింది ఈ ఘటన. రష్యాకు చెందిన 35 ఏళ్ల మరినా అనే మహిళ.. 45 ఏళ్ల ఆర్రే  ను పెళ్లి చేసుకుంది. అతనికి అప్పటికి 11 ఏళ్ళ కొడుకు ఉన్నారు. ఇక సదరు మహిళ సదరు బాలున్ని  కన్నకొడుకుగా  ఎంతో ప్రేమగా చూసుకునేది. అయితే కొన్ని రోజుల వ్యవధిలోనే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే అతనికి విడాకులు ఇచ్చి ఒంటరి జీవితాన్ని మొదలు పెట్టింది. అయితే పదేళ్ల పాటు మరినాతో పెరిగిన కొడుకు ఆమెను వదిలి ఉండలేక పోయారు.  అప్పటికే అతనికి 20 ఏళ్లుదాటిపోవడంతో తండ్రికి విడాకులు ఇచ్చిన సదరు మహిళ చివరికి కొడుకుని పెళ్లి చేసుకుంది.



 ఈ విషయం తెలిసి తండ్రికి గుండె ఆగినంత పని అయింది. ఇక చివరికి ఇష్టం లేకపోయినప్పటికీ కొడుకు ఇష్టాన్ని కాదనలేక  కష్టంగా  వారి బంధానికి స్వాగతం పలికాడు. ఈ క్రమంలోనే ఒక్క నెలలోనే మరీనా  గర్భవతి గా మారిపోయింది. ఇటీవలే ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మరోసారి ఈ మహిళా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అంతేకాదు ఈ మహిళకు ఇంస్టాగ్రామ్ వేదికగా లక్షల మంది ఫాలోవర్లు ఉండడం గమనార్హం.. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలాంటి ఘటనలు తెరమీదికి వచ్చినప్పుడు సభ్యసమాజం ఎటు పోతుందో అని అందరూ భయాందోళనకు గురి అయ్యే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అనే విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: