ఈ క్రమంలోనే అటు బీజేపీ నేతలు అందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇప్పుడు కేసీఆర్ సర్కారు తీరును తీవ్రస్థాయిలో బీజేపీ నేత ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధిస్తున్నారు. కాగా విజయశాంతి మరోసారి కేసీఆర్ సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా విచ్చలవిడిగా దోపిడీలు జరుగుతాయి అంటూ వ్యాఖ్యానించారు బీజేపీ నాయకురాలు విజయశాంతి. కేసిఆర్ బంగారు తెలంగాణ తెస్తామని ప్రజలకు మాయమాటలు చెప్పారని కానీ ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదు అంటూ విమర్శలు గుప్పించారు.
నా తెలంగాణ ఎటు పోతుందో కూడా అర్థం కావడం లేదు అంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు. నా తెలంగాణకు తెరాస పాలనలో అన్యాయం జరుగుతుంది అంటూ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలి అంటే ప్రజలందరూ మరోసారి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బిజెపి నాయకురాలు విజయశాంతి. ఇక తెలంగాణ అభివృద్ధి బీజేపీ పార్టీ తోనే సాధ్యం అవుతుందని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు బీజేపీ నేత విజయశాంతి.