సాధారణంగా నేటి రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరూ కూడా ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోవడం లేదు అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే అనారోగ్యకరమైన ఆహార నియమాలను పాటిస్తూ ఎన్నో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు నేటి రోజులలో జనాలు. ప్రస్తుతం.. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడంతో ఎంతో మంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఎవరు కూడా ఆహార నియమాలను అస్సలు పాటించడం లేదు. ముఖ్యంగా  రాత్రి సమయంలో ఏ టైం లో ఆహారం తింటే మంచిది అని అటు ఎంతోమంది లో సందేహం నెలకొంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సందేహానికి ఇటీవల కొంతమంది పరిశోధకులు సర్వే ద్వారా సమాధానమిచ్చారు.



 అయితే రాత్రి 8 గంటల లోపు ప్రతి ఒక్కరు ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు అని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఒక ఇటీవల నిర్వహించిన సర్వే కూడా ఇదే చెబుతుంది. రాత్రి 8 గంటల తర్వాత ఎవరైనా ఆహారం తీసుకుంటే.. వారి శరీరంలో బాడీ మాస్ ఇండెక్స్ అధికశాతంలో పెరుగుతుంది అని సర్వేలో వెల్లడైనట్లు తెలిపారు పరిశోధకులు. ఎవరైతే రాత్రి 8 గంటలకు ముందు ఆహారం తీసుకుంటారో .. వారి శరీరంలో మాత్రం బాడీ మాస్ ఇండెక్స్  చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించామని పరిశోధకులు వెల్లడించారు




 రాత్రి 8 గంటల తర్వాత ఎవరైతే స్నాక్స్ రూపంలో కానీ లేదా ఆహారం రూపంలో గానీ ఏదైనా తీసుకుంటే శరీరంలో కొవ్వు శాతం చాలా ఎక్కువగా పెరిగి లావుగా అయిపోయే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది.  అంతేకాకుండా రాత్రి సమయం లోనే కాదు పగటి  సమయంలో కూడా ఎక్కువ కాలరీలు తీసుకునేవరిలో కాస్త తేడా ఉన్నట్లు వెల్లడించారు.  ఆహారం తీసుకునే విధామే  కాదు  నిద్ర కూడా అతని ఆరోగ్యం సరిగ్గా ఉండటం పై  కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్పుకొచ్చారు.  ఎంతోమంది రాత్రి సమయంలో సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్లే ప్రభుత్వం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: