ఏపీ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ యువ ఎంపీ అత్త కు ఘోర పరాజయం ఎదురైంది. ఆమె టీడీపీ యువ పార్లమెంట్ సభ్యుడైన రామ్మోహన్ నాయుడికి అత్తయ్య వరస అవుతారు. రామ్మోహన్ నాయుడు దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు కుమారుడు అన్న విషయం తెలిసిందే. ఐతే రామ్మోహన్ నాయుడు టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ యొక్క కుమార్తె శ్రావ్య ను పెళ్లి చేసుకున్నారు. దీంతో బండారు సత్యనారాయణ సతీమణి మాధవిలత యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు కి అత్తయ్య అయ్యారు.

 
ఐతే ఆమె ఇటీవల తన స్వస్థలమైన పరవాడ మండలం లోని వెన్నెలపాలెం గ్రామం లో సర్పంచ్ పదవికి పోటీ చేశారు. గతంలో ఆమె వెన్నెల పాలెం గ్రామ సర్పంచ్ పదవికి రెండుసార్లు పోటీ చేసి రెండు సార్లు కూడా విజయం సాధించారు. కానీ ఈసారి మాత్రం వైసీపీ మద్దతుదారుడు వెన్నెల అప్పారావు చేతిలో 454 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో ఒక్కసారిగా బండారు సత్యనారాయణ, రామ్మోహన్ నాయుడు ఖంగుతిన్నారు. కుప్పం వంటి చేదు అనుభవం తమకి కూడా ఎదురు కావడంతో  మాధవీ లత కూడా తీవ్ర నిరాశ మునిగిపోయారు. ఒక యువ ఎంపీ అత్తయ్య, ఒక మాజీ మంత్రి భార్య అయ్యి ఉండి కూడా సర్పంచ్ పోటీల్లో గెలవలేకపోవడం నిజంగా సిగ్గుచేటని వైసీపీ సానుభూతిపరులు కామెంట్స్ చేస్తున్నారు.


బండారు సత్యనారాయణ ఎల్లో మీడియా ముందుకు వచ్చి జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ తానేదో గొప్ప నాయకుడు అన్నట్టుగా పోజులిస్తారు. కానీ ఆయన సొంత గ్రామంలో కూడా గెలవలేక 'మీడియా పులి' గా మాత్రమే మిగిలిపోయారు. ఇంకో విషయం ఏమిటంటే వెన్నెల పాలెం గ్రామంలో మొత్తం 10 వార్డులకు 10 వార్డులూ వైఎస్సార్సీపీ మద్దతుదారులే గెలిచారు. దీంతో టీడీపీ శ్రేణులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నెటిజన్లు "బిల్డప్పులు ఇచ్చే బండారు సత్యనారాయణ సొంత గ్రామంలో కూడా గెలవలేకపోయారు" అని ఎద్దేవా చేస్తూ తీవ్ర వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: