

అత్యున్నతమైన ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మాలావత్ పూర్ణ,ఆనంద్లు ఆయన శిష్యులే,దళిత గిరిజన బిడ్డలు అత్యున్నత స్థానాల్లో ఉండాలని ఆర్ ఎస్ ప్రవీణ్కుమార్ ఆంకాంక్షించేవారు.బడుగు బలహీన వర్గాల సాధికారిత కోసం స్వేరోస్ అనే సంస్థని స్థాపించి కొత్త ఉద్యమానికి ఆయన శ్రీకారం చుట్టారు.తెలంగాణ గురుకులాల కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గురుకులాలను పూర్తిస్థాయిలో మార్చేశారు.అత్యాధునిక హంగులతో అన్ని గరుకులాలను ఆధునీకరించారు.మంచి విద్యాబోధన అందించేలా ఆయన చర్యలు తీసుకున్నారు.అయితే ప్రవీణ్ కుమార్పై ఇటీవల పలు ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా బీజేపీ నేతలు ఆయనపై అనేకసార్లు మతపరమైన ఆరోపణలు చేశాయి. హిందూ దేవుళ్ల మీద ప్రమాణం చేయడాన్ని ఆయన వ్యతిరేకించడంతో పలు హిందూ సంస్థలు ఆయనపై మండిపడ్డాయి.