ఇక తెలంగాణకు ముందు నుంచి వైఎస్ వ్యతిరేకి అన్న విషయం తెలిసిందే. అలాంటి గడ్డపై ఆయన కుమార్తెగా షర్మిల ఎంత వరకు రాజకీయాల్లో నెగ్గుకు వస్తారు ? అన్నదే చెప్పాలి. ఇక ఇప్పుడు తెలంగాణ గడ్డపై షర్మిల పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం అన్న దానిపై ఎవరి లెక్కల్లో వారు మునిగి తేలుతున్నారు. షర్మిల పార్టీ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా తో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా గ్రేటర్ హైదరాబాద్ లాంటి చోట్ల ఎంతో కొంత ప్రభావం అయితే చూపుతుందని రాజకీయ వర్గాలు లెక్కలు కడుతున్నాయి.
అంతిమంగా ఎవరు నష్టపోయినా.. ఎవరు లాభ పడినా కూడా షర్మిల పార్టీ తెలంగాణ లో బలపడితే ముందుగా ఆ ఎఫెక్ట్ విపక్ష కాంగ్రెస్ మీదే ఉంటుందని అంటున్నారు. షర్మిల పార్టీ రెడ్ల ఓట్లనే ఎక్కువుగా చీల్చు తుందని అంటున్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ వర్గాలు కాంగ్రెస్ కు ముందు నుంచి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉంటూ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈ రెండు వర్గాల ఓట్లను షర్మిల ఎంతో కొంత చీల్చితే అది కాంగ్రెస్కే నష్టం అనడంలో సందేహం లేదు.
ఇక తెలంగాణ లో త్వరలోనే షర్మిల పాదయాత్ర ప్రారంభం కానుంది. ఆమె యేడాది పాటు మొత్తం 90 నియోజకవర్గాల్లో పాదయాత్రకు రెడీ అవుతున్నారు. ఎంతైనా ఆ యాత్ర ప్రభావం ఉంటుంది. ఏదేమైనా ఎలా చూసినా కూడా షర్మిల పార్టీ బలపడితే అది గులాబీ పార్టీ, బీజేపీ కంటే కాంగ్రెస్కే నష్టం అయ్యేలా కనిపిస్తోంది.